మెగా హీరో రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి తీవ్రంగా నిరాశ పరిచింది.బోయపాటి సినిమా మరి ఇంత యాక్షన్ ఏంటి అంటూ విమర్శలు వస్తున్నాయి.
అయితే గుడిలో మెల్ల అన్నట్లుగా ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ అయితే రాబట్టుకుంది.కొన్ని చోట్ల బాహుబలి తర్వాత స్థానంలో నిలిచింది.
అయితే అదంతా కూడా మొదటి రోజు ముచ్చటే.ఆతర్వాత రోజు నుండి పరిస్థితి ఏమాత్రం బాగాలేదు.
సినిమా విడుదల కాకముందు సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.అంచనాల కారణంగా సినిమా ఏకంగా వంద కోట్ల బిజినెస్ చేసింది.అన్ని ఏరియాల్లో కూడా రంగస్థలం స్థాయిలో బిజినెస్ చేయడం తో నిర్మాతలు లాభాల్లో పడ్డారు.72 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా 100 కోట్లు వసూళ్లు చేస్తుందని అంతా భావించారు.కానీ అనూహ్యంగా సినిమా 40 కోట్ల వద్ద ఆగిపోయింది.నిర్మాతల పరిస్థితి పక్కన పెడితే సినిమాను కొనుగోలు చేసిన డిస్టిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోయే అవకాశం కనిపిస్తోంది.
దిల్ రాజు మరియు యూవీ క్రియేషన్స్ వారు ఎక్కువగా ఈ సినిమా రైట్ ను కొనుగోలు చేయడం జరిగింది.నైజాం ఏరియాలో ఈ సినిమా దాదాపుగా 10 కోట్ల వరకు నష్టాలను మిగల్చడం ఖాయంగా కనిపిస్తుంది.
అయితే వినయ విధేయ రామ సినిమా వల్ల వచ్చిన నష్టాలు ఎఫ్ 2 సినిమా ద్వారా రికవరీ అవుతున్నాయి.డిష్టిబ్యూటర్ లకు దానయ్య ఏమైనా సాయం చేస్తాడేమో చూడాలి.72 కోట్ల బడ్జెట్ సినిమా మరి 40 కోట్లు వసూళ్లు చేయడం అనేది దారుణం.