మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వినయ విధేయ రామ’ ఎలాంటి అంచనాల నడుమ రిలీజ్ అయ్యిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తు్న్నాడనే విషయం తెలియగానే మెగా ఫ్యాన్స్తో పాటు కామన్ ఆడియెన్స్ కూడా ఈ సినిమాను తొలిరోజు చూడాలని ఫిక్స్ అయ్యారు.
కానీ సినిమా రిలీజ్ అయిన తరువాత అంచనాలు అన్నీ తలకిందులయ్యాయి.
తొలిరోజే ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు కూడా ఇష్టపడలేదు.
అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డ, ఇప్పుడు మాత్రం అదిరిపోయే ఫీట్లు చేస్తోంది.ఈ సినిమాను ఇప్పటికే పలుమార్లు టీవీలో టెలికాస్ట్ కూడా చేశారు.
అయితే బుల్లితెర ప్రేక్షకులు ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ ఇస్తున్నారు.ఇప్పటి వరకు 10 సార్లు ఈ సినిమాను ‘స్టార్ మా’లో టెలికాస్ట్ చేశారు.అయితే 10వ సారి ఈ సినిమా టెలికాస్ట్ అయినా కూడా ఏకంగా 7.5 టీఆర్పీ రేటింగ్ నమోదు కావడంతో చిత్ర వర్గాలు అవాక్కవుతున్నాయి.
ఇప్పటివరకు ఏ టాలీవుడ్ సినిమా కూడా ఇలాంటి రికార్డును క్రియేట్ చేయలేదని సినీ విశ్లేషకులు అంటున్నారు.ఒక రకంగా ఈ సినిమా బుల్లితెరపై ఆల్టైమ్ రికార్డు క్రియేట్ చేసిందని వారు అంటున్నారు.
బోయపాటి మాస్కు చరణ్ యాక్టింగ్ తోడు కావడంతో ఈ సినిమాను బుల్లితెర ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.ఇక బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే.
మరి ఈ సినిమా మున్ముందు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.