నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ను ఇప్పటికే ప్రారంభించిన చిత్ర యూనిట్కు కరోనా వైరస్ ప్రభావం అడ్డంకిగా మారింది.
ఈ సినిమా షూటింగ్ వాయిదా పడటంతో నందమూరి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.కాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను ఇప్పటికే రిలీజ్ చేయగా ప్రేక్షకులను మెప్పించడంలో అది పూర్తిగా సక్సె్స్ అయ్యింది.
ఇక ఈ సినిమాతో బాలయ్య మరోసారి అదిరిపోయే బ్లాక్బస్టర్ను అందుకునేందుకు రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
అందులో ఒకటి రైతు పాత్ర కాగా మరొకటి అఘోరా పాత్ర అని తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో బాలయ్యను ఢీకొట్టే విలన్ పాత్ర చాలా పవర్ఫుల్గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా ఈ సినిమాలో అసలు విలన్ ఎవరనేది చాలా సస్పెన్స్గా ఉండనుందట.ఈ క్రమంలోనే బాలయ్య విలన్ ఎవరో తెలుసుకునే విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ అంటోంది.
ఒకానొక సమయంలో బాలయ్య కంటే కూడా విలన్ పాత్ర ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని, ఆ సందర్భంలో విలన్దే పైచేయి అవుతుందని చిత్ర యూనిట్ అంటోంది.అయితే ఇంత ప్రాముఖ్యత ఉన్న విలన్ పాత్రను ఎవరు పోషిస్తున్నారా అనే అంశంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
ఇప్పటికే ఈ విలన్ పాత్ర కోసం పులువురు బాలీవుడ్ నటులను చిత్ర యూనిట్ సంప్రదిస్తున్నట్లు వార్తలు వస్తు్న్నాయి.మరి బాలయ్య మీద పై చేయి సాధించే ఆ విలన్ ఎవరో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.