టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్లు ఈ ఏడాది సంక్రాంతికి తమ సినిమాలతో అదిరిపోయే హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.సరిలేరు నీకెవ్వరు చిత్రంతో మహేష్ అదరగొట్టగా, అల వైకుంఠపురములో చిత్రంతో బన్నీ దడదడలాడించాడు.
ఇక ఈ ఇద్దరు హీరోలు తమ నెక్ట్స్ చిత్రాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు ఓ విషయం ఈ ఇద్దరు హీరోలకు పెద్ద తలనొప్పిగా మారిందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ అనే సినిమాలో నటిస్తున్న బన్నీ, ఈ సినిమాలో అదిరిపోయే లుక్తో మనకు కనిపించనున్నాడు.ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైన సంగతి తెలిసిందే.
ఈ సినిమాను ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ నటించనున్నట్లు తెలుస్తోంది.కాగా తొలుత ఈ సినిమాలో విలన్గా విజయ్ సేతుపతి నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.
కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఈ సినిమా నుండి వాకౌట్ చేశాడు.ఇక ఈ సినిమాలో విలన్గా ఎవరు నటిస్తారా అనే అంశం ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు.
పలువురు స్టార్స్ పేర్లు ఈ జాబితాలో వినిపించినా ఇంకా ఎవరూ ఫైనల్ కాలేదు.అటు మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రంలో కూడా విలన్ ఎవరు అనే అంశంపై ఎలాంటి క్లారిటీ లేదు.
గతంలో ఈ సినిమాలో విలన్గా ఉపేంద్ర, సుదీప్ వంటి పేర్లు వినిపించినా, చిత్ర యూనిట్ మాత్రం ఇంకా ఎవరినీ ఫైనల్ చేయలేదు.దీంతో ఈ రెండు టాప్ చిత్రాలకు విలన్ సమస్యగా మారారు.
దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న సోషల్ మెసేజ్ చిత్రం ‘సర్కారు వారి పాట’లో మహేష్ స్టైలిష్ లుక్కు అంతే అల్ట్రా స్టైలిష్ విలన్ కావాలని చిత్ర యూనిట్ చూస్తోంది.అటు బన్నీ సినిమాలో విలన్ పాత్ర పూర్తి మాస్గా ఉండనుండటంతో రఫ్గా కనిపించే విలన్ కోసం సుకుమార్ అండ్ టీమ్ వెతుకుతున్నారు.
మరి ఈ ఇద్దరు హీరోలను ఢీకొట్టే ఆ విలన్ ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు ఆయా చిత్ర యూనిట్లు.ఇక మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోండగా, బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది.