ఈమధ్య లాక్ డౌన్ కారణంతో వీధులు ఖాళీగా ఉండడంతో అడవుల్లో ఉండాల్సిన జంతువులు కాస్త రోడ్ల మీదకు వచ్చి వీర విహారం గాని సృష్టిస్తున్నాయి.ఇకపోతే గత వారం రోజుల కిందట హైదరాబాద్లో కూడా చిరుత రోడ్ల మీదకు వచ్చి ఒక వ్యక్తిని గాయపరిచిన సంగతి అందరికీ తెలిసిందే.
ఇకపోతే తాజాగా జనావాసాల్లోకి ప్రవేశించిన చిరుతను దారుణంగా కొట్టి చంపారు కొందరు వ్యక్తులు.అయితే ఈ సంఘటన అస్సాం రాష్ట్రం రాజధాని గువాహటి శివారు ప్రాంతంలో ఆదివారంనాడు జరిగింది.
అక్కడ ఉన్న కాలనీల్లోకి చొరబడిన చిరుతను స్థానికులు దాన్ని వెంబడించి దానిపై మూకుమ్మడిగా దాడి చేశారు.ఇక అంతే చావుదెబ్బలు తిన్న చిరుత ప్రాణాలు విడిచింది.ఆ తర్వాత అక్కడి వారంతా చిరుత మృతదేహాన్ని ఊరేగించారు.అయితే ఇలా చేసిన ఊరేగింపు కాస్త వైరల్ కావడంతో దాన్ని అటవీ శాఖ అధికారులు తెలుసుకొని మొత్తం ఆరుగురిని అరెస్టు చేశారు.
అంతే కాదు మిగతా వారిపై కూడా కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.
ఇకపోతే ఆదివారం నాడు ఉదయం తాము ఉంటున్న ప్రదేశంలోకి చిరుత ప్రవేశించిన విషయం అధికారులకు తెలియజేసిన బోను ఏర్పాటు చేయలేదని అక్కడి ప్రజలు తెలుపుతున్నారు.
దీనితో తామే బోను ఏర్పాటు చేసి దాన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేశామని వారు తెలిపారు.అయితే అందులో పడిన చిరుత ఎలాగో తప్పించుకుని తమపై దాడి చేయడంతో మేము దానిని తరిమి చంపవలసి వచ్చిందని అక్కడి ప్రజలు తెలిపారు.
ఒకవేళ అటవీ అధికారులు దాన్ని బంధించి ఉంటే గనక మేమెందుకు చంపుతామని గ్రామస్తులు తెలియజేస్తున్నారు.