పెళ్లంటే నూరేళ్ల పంట అని చాలా మంది పెద్దలు చెబుతారు.అటువంటి పెళ్లి జరగడం కోసం కొంతమంది ఎలాంటి రిస్క్ అయినా చేస్తారు.
వేయి అబద్దాలాడైనా పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తుంటారు.అంతే కాకుండా పెళ్లి చేసుకునే అమ్మాయికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడని భావిస్తారు.
అందుకోసం ఎలాంటి పనులు చేయడానికైనా వెనుకాడరు.అలాగే ఓ ప్రాంతంలో పెళ్లి కోసం ఏకంగా రాత్రికి రాత్రే బ్రిడ్జిని నిర్మించారు.అదెక్కడంటే….
బీహార్ రాష్ర్టంలోని ఫుల్సర గ్రామానికి చెందిన బతేష్ అనే వ్యక్తి తన కూతురు పెళ్లి గ్రామం సమీపంలో ఉన్న కాలువపై ఏకంగా బ్రిడ్జినే నిర్మించాడు.
వరుడి తరఫు బందువులు కోలాహాలంగా హంగు ఆర్భాటాలతో వస్తారని ఈ బ్రిడ్జి నిర్మించినట్టు తెలియజేశారు.బ్రిడ్జి నిర్మాణం కోసం గ్రామస్తులంతా తలో చేయి వేశారు.అందువల్లే రాత్రికి రాత్రే బ్రిడ్జి నిర్మాణం కంప్లీట్ అయింది.ఈ బ్రిడ్జిని వెదురు బొంగులతో నిర్మించారు.
ఇలా గ్రామస్తులందరూ కలిస్తే ఎంతటి పనయినా సులువుగా పూర్తవుతుందని వారు నిరూపించారు.తెల్లారితే పెళ్లి అనగా కట్టిన బ్రిడ్జిని చూసి పెళ్లి కొడుకు బంధువులు అందరూ ఆశ్చర్యపోయారు.
అసలు గ్రామంలోకి ఎలా వెళ్లాలా.అని యోచించిన పెళ్లి కొడుకు వెదురు వంతెన నిర్మించడంతో ద్విచక్రవాహనం పై జాలీగా వెళ్లాడు.
అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు.ఇది ఆ పెళ్లి కొడుకు ఒక్కడికే ఉపయోగపడలేదు.
రోడ్డు సౌకర్యం లేని ఆ గ్రామానికి చేరుకోవాలంటే… కాలువ దాటాలి.కావున అందరూ తేలిక పాటి వాహనాలను ఉపయోగిస్తూ… బ్రిడ్జిపై నుంచి రాకపోకలు సాగిస్తున్నారు.ఈ ఘటన ప్రస్తుతం బీహర్ రాష్ర్టంలో హాట్ టాపిక్ గా మారింది.ఇది విన్న పలువురు బీహర్ లో గ్రామీణులు ఎదుర్కొంటున్న సమస్యలు ఎలా ఉంటాయో ఈ ఘటన అద్దం పడుతోందని అంటున్నారు.