వికారాబాద్ జిల్లా పరిగి మండలం సుల్తాన్పూర్ తండాలో దారుణం చోటు చేసుకుంది.తన భూమిలో గుప్త నిధులు ఉన్నాయంటూ పూజకు సిద్ధమైయ్యాడు.
దీనిలో భాగంగా గుప్త నిధుల తవ్వకాలకు ఏర్పాట్లు చేసుకుంటున్న భూ యజమానితో పాటు మరో ఇద్దరిని తండావాసులు అడ్డుకున్నారు.ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.
దీంతో భూమి యజమానిపై తండావాసులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.