యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమా కోసం ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులు నిరీక్షించారు.
నాలుగేళ్ళ తర్వాత ఎన్టీఆర్ మంచి హిట్ అందుకోవడంతో ప్రేక్షకులు ఆనందంగా ఉన్నారు.ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ అంతా ఈయన నెక్స్ట్ సినిమా ‘ఎన్టీఆర్ 30’ కోసమే ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా భారీ విజయం తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ తో సినిమా చేయనున్నాడు.అయితే ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు.అయితే ఇప్పటికే ఈ సినిమా నుండి మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి అంచనాలు పెంచేసాడు.దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ లైనప్ లో మరొక డైరెక్టర్ కూడా ఉన్నారు.కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కూడా ఎన్టీఆర్ సినిమా కన్ఫర్మ్ అయ్యింది.
ఇప్పటికే వీరి సినిమా అఫిషియల్ గా ప్రకటించారు.ఈ సినిమాను నీల్ భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించ నున్న విషయం తెలిసిందే.
ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరొక కీలక పాత్ర కూడా ఉందట.
ఈ పాత్ర కోసం ప్రశాంత్ నీల్ తమిళ్ హీరో విక్రమ్ ను ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారట.ఇప్పటికే ఈయన చర్చలు కూడా జరిపి ఈయనను ఒప్పించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుస్తుంది.మరి ఈ పాత్ర సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని తెలిసి విక్రమ్ ఓకే చెబుతాడో లేదో చూడాలి.
ఇక హీరోయిన్ విషయానికి వస్తే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు.
ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని నీల్ కూడా భారీ యాక్షన్ విజువల్స్ ను ప్లాన్ చేస్తున్నాడని ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే మైలురాయిలా నిలిచి పోయే అవకాశం ఉంది అని తెలుస్తుంది.
ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో షూట్ స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.ప్రెజెంట్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ హీరోగా సలార్ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాను హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తుండగా.శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.