టాలీవుడ్లో ఓ సరికొత్త ట్రెండ్ సెట్టర్ మూవీగా కల్ట్ క్లాసిక్ అర్జున్ రెడ్డి నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే.సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన ఈ బోల్డ్ కంటెంట్ మూవీలో రెచ్చిపోయి నటించిన విజయ్ దేవరకొండ ఎలాంటి సక్సెస్ను అందుకున్నాడో, ఏ విధంగా ఓవర్నైట్ స్టార్గా మారిపోయాడో అందరికీ తెలిసిందే.
అయితే ఈ సినిమా దెబ్బకు ఓ స్టార్ హీరో కొడుకు మాత్రం సినిమాలు వదిలేయాల్సిన పరిస్థితి వచ్చి పడింది.తమిళంలో అర్జున్ రెడ్డి సినిమాను ‘ఆదిత్య వర్మ’ అనే పేరుతో ప్రముఖ దర్శకుడు గిరీశయ్య తెరకెక్కించాడు.
తమిళ విలక్షణ నటుడు విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ను హీరోగా పరిచయం చేస్తూ గిరీశయ్య ఈ సినిమాను తెరకెక్కించాడు.అయితే ఈ సినిమా తమిళంలో డిజాస్టర్ మూవీగా నిలిచింది.
దీంతో తెలుగు అర్జున్ రెడ్డి చిత్రంతో ఆదిత్య వర్మ సినిమాను పోల్చడం మొదలుపెట్టారు నెటిజన్లు.
ఈ క్రమంలో ధృవ్ విక్రమ్పై దారుణమైన ట్రోల్స్ చేశారు.
ఇది చూసిన ధృవ్ విక్రమ్ ఇకపై సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఇలాంటి ట్రోల్స్ ఎదురవుతాయని తాను అస్సలు ఊహించలేదని ధృవ్ అంటున్నాడు.
మొత్తానికి అర్జున్ రెడ్డి సినిమా దెబ్బకు ఓ హీరో కొడుకు సినిమాలు వదిలేసే పరిస్థితి నెలకొనడంతో తమిళనాట ఈ విషయం హాట్ టాపిక్గా మారింది.