అక్కినేని నట వారసుడు, నాగార్జున తనయుడు చైతన్య వరుస సినిమాలతో తనకంటూ గుర్తింపు సొంతం చేసుకున్నాడు.కాస్తా లవ్ స్టొరీ కథలతోనే ఎక్కువ సక్సెస్ లు అందుకున్న చైతూ ప్రస్తుతం మరో లవ్ స్టొరీతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు.
ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.ఇదిలా ఉంటే తన నెక్స్ట్ సినిమాని విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చేయడానికి డిసైడ్ అయిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా త్వరలో పట్టాలు ఎక్కుతుంది.
అయితే ఇన్ని రోజులు ఇది సోషల్ కాన్సెప్ట్ అని అందరూ భావించారు.
కాని ట్రాక్ తప్పిన దర్శకుడు విక్రమ్ ఈ సారి తన స్టైల్ లో భిన్నమైన కథని ఎంచుకున్నట్లు తెలుస్తుంది.అది కూడా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండే ఒక రియాలిటీ స్టొరీకి ఫాంటసీ మిక్స్ చేసి చైతూ కోసం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.
ఇంచుమించు మనం స్టైల్ లో ఉండే లవ్ స్టొరీ కథనే చైతూకి చెప్పి ఒప్పించడాని సమాచారం.మరి ఈ సినిమాతో అయిన ఈ క్రియేటివ్ దర్శకుడు సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో వేచి చూడాలి.