అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం లవ్ స్టోరి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాలో ఫిదా బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోండగా, ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.కాగా చైతూ తన నెక్ట్స్ చిత్రాన్ని ‘మనం’ దర్శకుడు విక్రమ్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.
అయితే ఈ గతంలో మనం చిత్రంతో తమ కుటుంబానికి అదిరిపోయే హిట్ అందించిన దర్శకుడితో తన నెక్ట్స్ మూవీ ఉండటంతో ఈ సినిమాను అన్ని విధాలా చాలా పర్ఫెక్ట్గా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు చైతూ.అయితే ఈ సినిమాలో చైతూకి జోడిగా సమంత మాత్రమే నటించాలనే కండీషన్ పెట్టాడు చిత్ర దర్శకుడు.
దీంతో చిత్ర యూనిట్ డైలమాలో పడింది.కాగా సమంతతో చైతూ కలిసి చేసిన నాలుగు చిత్రాల్లో మూడు సినిమాలు సూపర్ హిట్గా నిలిచాయని, కేవలం ఒకేఒక్క సినిమా ఫ్లాప్గా నిలిచిందని విక్రమ్ అంటున్నాడు.
ఈ సెంటిమెంట్ను ఫాలో అవుతూ ఇప్పుడు చైతూ జోడీగా సమంత అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుందని, అప్పుడే తాను ఈ సినిమా చేస్తానని విక్రమ కూమార్ తేల్చి చెప్పాడు.దీంతో చైతూ సమంతను ఒప్పంచే పనిలో పడ్డాడట.
మరి చైతూ కోసం సమంత ఈ సినిమాలో నటిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.ఇక చైతూ నటిస్తున్న లవ్స్టోరి ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.