మనం సినిమాతో టాలీవుడ్ లో అందరి దృష్టిని తనవైపుకి తిప్పుకున్న దర్శకుడు విక్రమ్ కె కుమార్ గ్యాంగ్ లీడర్ లాంటి ఫ్లాప్ తర్వాత గ్యాప్ తీసుకొని నాగ చైతన్యతో థాంక్యూ సినిమా చేయడానికి కమిట్ అయిన సంగతి తెలిసిందే.దిల్ రాజు ప్రొడక్షన్ లో ఈ సినిమా తెరకెక్కబోతుంది.
ఇక నాగ చైతన్య ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.మనం తర్వాత విక్రమ్, చైతూ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది.కమర్షియల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ సినిమా కథని దర్శకుడు విక్రమ్ కె కుమార్ సిద్ధం చేశాడు.ఇదిలా ఉంటే దసరా సందర్భంగా ఈ సినిమాని గ్రాండ్ గా లాంచ్ చేశారు.
లెజెండరీ కెమెరామెన్ పీసీ శ్రీరామ్ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించబోతున్నాడు.ఇదిలా ఉంటే ఈ సినిమా లాంచింగ్ సందర్భంగా చైతూ తన మొదటి సినిమా నిర్మాత దిల్ రాజు, మనం లాంటి మెమొరబుల్ హిట్ ఇచ్చిన విక్రమ్ కె కుమార్ కాంబినేషన్ లో సినిమా చేయడం ఆనందంగా ఉందని తెలిపాడు.
ఇదిలా ఉంటే ఇది నాగ చైతన్యకి 20వ సినిమా అని తెలుస్తుంది.ప్రస్తుతం లవ్ స్టోరీ షూటింగ్ లో నాగ చైతన్య ఉన్నాడు.ఈ నేపధ్యంలో డిసెంబర్ నుంచి థాంక్యూ రెగ్యులర్స్ షూటింగ్ స్టార్ట్ చేయాలని విక్రమ్ కె కుమార్ ప్లాన్ చేస్తున్నాడు.ఇక ఇందులో హీరోయిన్ గా క్రేజీ బ్యూటీ రష్మిక మందన కోసం ప్రయత్నం చేస్తున్నారు.
త్వరలో హీరోయిన్ కి సంబంధించి కూడా కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే గ్యాంగ్ లీడర్ లాంటి డిజాస్టర్ తర్వాత విక్రమ్ కె కుమార్ నుంచి ఈ సినిమా వస్తుంది.
ఈ నేపధ్యంలో విక్రమ్ తన బ్రాండ్ నిలుపుకోవటానికి కచ్చితంగా ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టాల్సి ఉంటుంది.
.