అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం లవ్ స్టోరీ చిత్రాన్ని చేస్తున్నాడు.శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఆ చిత్రం ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా వేశారు.
షూటింగ్ కాస్త బ్యాలన్స్ ఉంది.లాక్డౌన్ ఎత్తివేసిన వెంటనే రెండు లేదా మూడు వారాల్లో ఆ బ్యాలన్స్ షూటింగ్ చేయబోతున్నారు.
ప్రస్తుతం చైతూ తదురి చిత్రంను తమిళ దర్శకుడు విక్రమ్ కుమార్తో చేయబోతున్నట్లుగా ఇప్పటికే క్లారిటీ వచ్చింది.
విక్రమ్ తన తమిళ మూవీ 13 బి కి సీక్వెల్ అన్నట్లుగా ఒక హర్రర్ కాన్సెప్ట్తో ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ చేశాడు.ఆ స్క్రిప్ట్ చైతూకు నచ్చడంతో దాన్ని చేసేందుకు సిద్దం అయ్యాడు.ఆ కథానుసారం హీరోయిన్కు స్కోప్ ఎక్కువగా ఉంది.
నటన పరంగా కూడా హీరోయిన్ చాలా పీక్స్లో ఉండాల్సి ఉంటుంది.అందుకే ఆ పాత్రకు గాను మంచి నటిని తీసుకోవాలని దర్శకుడు విక్రమ్ భావిస్తున్నాడట.
మనం చిత్రంలో మంచి నటనతో మెప్పించిన సమంతనే మళ్లీ ఈ చిత్రంలో రిపీట్ చేయాలని దర్శకుడు విక్రమ్ భావిస్తున్నాడట.ఈ విషయాన్ని చైతోతో కూడా దర్శకుడు చెప్పాడట.అయితే ఇంకా ఏదైనది తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.గత ఏడాది మజిలీ చిత్రంతో చైతూ, సమంత ప్రేక్షకుల ముందుకు వచ్చారు.మళ్లీ మళ్లీ వీరి జోడీ వస్తే ప్రేక్షకులు ఆధరిస్తారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.అందుకే 13 బి సీక్వెల్లో సమంత ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.