యూపీ గ్యాంగ్ స్టార్ వికాస్ దూబే ఇటీవల పోలీసుల ఎన్ కౌంటర్ లో హతమైన సంగతి తెల్సిందే.అత్యంత నాటకీయ పరిణామాల నేపథ్యంలో గ్యాంగ్ స్టార్ దూబే ఎన్ కౌంటర్ చోటుచేసుకోవడం తో అటు విపక్షాలు సైతం విమర్శలు గుప్పించాయి.
అయితే అతడి ఎన్ కౌంటర్ పై తాజాగా దూబే సతీమణి రిచా దూబే కీలక వ్యాఖ్యలు చేశారు.అతడి అంత్యక్రియల్లో పాల్గొన్న ఆమె తప్పు చేసిన నా భర్త కు సరైన శిక్ష పడింది అంటూ పోలీసుల చర్యను సమర్ధించారు.
గ్యాంగ్ స్టార్ వికాస్ దూబే అంత్యక్రియలు కాన్పూర్ లోని భైరవ్ ఘాట్ లో ఏర్పాటు చేయగా ఈ సందర్భంగా అక్కడకి వచ్చిన రిచా తన భర్త ఎన్ కౌంటర్ సరైన చర్య అంటూ సమర్ధించారు.
నా భర్త చేసిన తప్పులకి సరైన శిక్ష పడింది అంటూ ఆమె వ్యాఖ్యానించారు.
ఆమె మాత్రమే కాకుండా వికాస్ దూబే తండ్రి రామ్ కుమార్ దూబే సైతం పోలీసుల చర్యలను సమర్ధించారు.యూపీ పోలీసులు సరైన నిర్ణయం తీసుకున్నారు.నా కుమారుడు 8 మంది పోలీసులను పొట్టన పెట్టుకున్నాడు ఇది క్షమించరాని నేరం అతడికి ఈ శిక్ష సరైనదే అంటూ ఆయన వ్యాఖ్యానించారు.అతడు ఏ నాడు కుటుంబానికి బాసటగా నిలిచింది లేదు,ఇంకా వికాస్ కారణంగా పూర్వీకుల ఆస్తులు సైతం నేలమట్టమయ్యాయి.
అలాంటి వ్యక్తి కి ఈ శిక్ష సరైనదే, ఇలా చేయకపోతే రేపు మరొకరు ఇలానే ప్రవర్తిస్తారు అంటూ వ్యాఖ్యానించారు.కాన్పూర్ లో దూబే అంత్యక్రియలు నిర్వహించగా అతడి భార్య ,చిన్న కుమారుడు తో పాటు బావమరిది దినేష్ తివారి మాత్రమే పాల్గొన్నట్లు తెలుస్తుంది.
పోలీసుల సమక్షంలోనే దూబే అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలుస్తుంది.