దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచినప్పటి నుండి బీజేపీ పార్టీ శ్రేణుల్లో పుల్ జోష్ నిండినట్లు కనిపిస్తుంది.అదీగాక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో తెలంగాణాలో బీజేపీ నేతలు పట్టపగ్గాలు లేకుండా దూకుడు మీదున్నారట.
అదీగాక తెలంగాణాలో తటస్థంగా ఉన్న కొందరు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు కాషాయ తీర్థం పుచ్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారట.ఈ క్రమంలోనే మాజీ మంత్రి, వికారాబాద్ నుంచి నాలుగు సార్లు గెలిచిన ఏ.చంద్రశేఖర్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.ఈయన వికారాబాద్ నుంచి గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్పైనా సెటైర్లు వేశారు.
తమ నాయకుడు కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తీసుకొచ్చిండ్రు అలాంటి నాయకుడి ని విమర్శిస్తే బడితపూజ చేస్తామంటూ ఎమ్మెల్యే ఆనంద్, చంద్రశేఖర్ ను హెచ్చరిస్తూ, అదే రీతిలో బదులిచ్చారు.అంతే కాకుండా తూతూమంత్రంగా గెలిచిన స్థానాలను చూసుకుని ఎగిరిపడుతున్న మీ జాతకం ఎలాంటిదో నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో బయటపడుతుందంటూ ఎద్దేవా చేశారు.