బడితపూజ చేస్తామంటూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హెచ్చరిక.. ఎవరికంటే.. ?

దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచినప్పటి నుండి బీజేపీ పార్టీ శ్రేణుల్లో పుల్ జోష్ నిండినట్లు కనిపిస్తుంది.అదీగాక జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో తెలంగాణాలో బీజేపీ నేతలు పట్టపగ్గాలు లేకుండా దూకుడు మీదున్నారట.

 Vikarabad Mla Methuku Anand Comments On Former Minister, Vikarabad, Mla Methuku-TeluguStop.com

అదీగాక తెలంగాణాలో తటస్థంగా ఉన్న కొందరు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు కాషాయ తీర్థం పుచ్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారట.ఈ క్రమంలోనే మాజీ మంత్రి, వికారాబాద్ నుంచి నాలుగు సార్లు గెలిచిన ఏ.చంద్రశేఖర్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.ఈయన వికారాబాద్ నుంచి గెలిచిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌పైనా సెటైర్లు వేశారు.

తమ నాయకుడు కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తీసుకొచ్చిండ్రు అలాంటి నాయకుడి ని విమర్శిస్తే బడితపూజ చేస్తామంటూ ఎమ్మెల్యే ఆనంద్, చంద్రశేఖర్ ను హెచ్చరిస్తూ, అదే రీతిలో బదులిచ్చారు.అంతే కాకుండా తూతూమంత్రంగా గెలిచిన స్థానాలను చూసుకుని ఎగిరిపడుతున్న మీ జాతకం ఎలాంటిదో నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో బయటపడుతుందంటూ ఎద్దేవా చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube