కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విజయశాంతి..!! 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ నాయకురాలు విజయశాంతి కీలక కామెంట్లు చేశారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం ఆయుష్మాన్ భారత్ లో చేరాలని తెలంగాణ ప్రభుత్వం తాజాగా నిర్ణయించుకోవడంతో ఎన్నాళ్లకి కేసీఆర్ కి జ్ఞానోదయం అయ్యిందో అని భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు విజయశాంతి కీలక కామెంట్లు చేశారు.

 Vijayshanthi Serious Comments On Kcr, Vijayshanthi, Kcr, Telangana, Bjp, Kcr Gov-TeluguStop.com

కేసీఆర్ ఈ రీతిగా నిర్ణయం తీసుకోవడం వెనుక తెలంగాణ బిజెపి ఒత్తిడి మాత్రమే అని స్పష్టం చేశారు.ఈ క్రమంలో గత కొద్ది నెలల నుండి కరోనాతో బాధపడుతూ ఆసుపత్రి బిల్స్ చెల్లిస్తున్న వారికి కూడా …తెలంగాణ ప్రభుత్వం అండగా ఉండాలని.

వారు చికిత్స నిమిత్తం చెల్లించిన ఫీజు వెనక్కి ఇచ్చేయాలని … కేసీఆర్ ప్రకటన చేస్తే ఇంకా బాగుంటుంది అని స్పష్టం చేశారు.రాష్ట్రంలో చాలా మాఫియాలు ఉన్నాయ్.

ఇప్పుడు మరో మాఫియా తయారయిందని మెడికల్ మాఫియా అని పేర్కొన్నారు.ప్రజల ప్రాణాలను పీక్కుతినేలా హాస్పిటల్లో బెడ్స్ అందక ఉన్న నేపథ్యంలో కరోనా చికిత్స లో కీలకమైన రెమ్ డెసివిర్ అదేవిధంగా వ్యాక్సిన్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని విజయశాంతి ఆరోపించారు.

  ఈ బ్లాక్ మార్కెట్ వెనకాల తెలంగాణ ప్రభుత్వం హస్తం ఉన్నట్లు విజయశాంతి ఆరోపణలు చేశారు. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube