వైసీపీ పార్టీలో చంద్రబాబు ని టార్గెట్ చేస్తూ కామెడీ పండించడంలో ముందు వరుసలో ఉంటారు సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.అవకాశం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో పోస్ట్ లేదా మీడియా సమావేశాలు పెట్టి.
చంద్రబాబుని ఆ పార్టీలో ఉండే వాళ్లను తనదైన శైలిలో కామెడీ పండిస్తూ విమర్శలు చేస్తారు.బాబు తర్వాత నారా లోకేష్ ని ఎక్కువగా విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చేసుకుని విమర్శలు చేస్తారు.
కాగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ పార్టీ గ్రాఫ్ తగ్గినట్లు వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మళ్ళీ చంద్రబాబు గెలవాలంటే కష్టమే అన్న తరహాలో విశ్లేషణలు వస్తున్నాయి.మరో పక్క చంద్రబాబు ఖచ్చితంగా పొత్తులు పెట్టుకోవాలనే భావనతో.
తన రాజకీయ పర్యటనలలో కామెంట్ చేస్తూ ఉన్నారు.ఈ పరిస్థితిలో విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుపై కామెడీ కామెంట్ పెట్టారు.
ప్రపంచ పటంలో నుండి ఆంధ్రప్రదేశ్ చచ్చిపోయింది అంటూ టీడీపీ నేతలు ఇటీవల చేసిన కామెంట్ లకు కౌంటర్లు వేస్తూ.పచ్చ మందకు పైత్యం బాగా పెరిగి పోయింది అని అన్నారు.రాష్ట్రంలో మనుషులు ఎవరికీ కనబడటం లేదా అంటూ ప్రశ్నించారు.అధికారం పోగొట్టుకుని పొర్లిపొర్లి ఏడుస్తున్నారు.‘మా బాబే సీఎం‘ అని గ్రాండ్ గా ఒక సినిమా తీసుకుని మురిసి పోండి.వేరే మార్గం లేదు’ అని విజయసాయిరెడ్డి తనదైన శైలిలో కామెంట్లు చేస్తూ ఎద్దేవా చేశారు.