స్టార్ రైటర్ గా ఇండియన్ వైడ్ గా విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న రచయిత విజయేంద్రప్రసాద్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాహుబలి సినిమాతో విజయేంద్ర ప్రసాద్ బ్రాండ్ వాల్యూ అమాంతం పెరిగిపోయింది.
దీని తర్వాత సల్మాన్ ఖాన్ కి బజరంగీ భాయ్ జాన్ లాంటి సూపర్ హిట్ కథని అందించడం ద్వారా బాలీవుడ్లో కూడా సక్సెస్ ఫుల్ జర్నీ స్టార్ట్ చేశారు.దీని తర్వాత హిందీలో కంగనా రనౌత్ మణికర్ణిక విజయేంద్రప్రసాద్ స్టోరీ సమకూర్చారు.
ఈ సినిమాతో కంగనా సూపర్ హిట్ అందుకోవడంతో పాటు బాలీవుడ్లో స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ ని సొంతం చేసుకుంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం హిందీలో పాన్ ఇండియా రేంజ్లో రామాయణం ఆధారంగా సీత టైటిల్ తో తెరకెక్కుతున్న మూవీకి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తున్నారు.
దీంతో పాటు ప్రస్తుతం ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబినేషన్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీకి కూడా రియల్ లైఫ్ క్యారెక్టర్స్ బేస్ చేసుకుని ఒక ఫిక్షన్ స్టోరీని సిద్ధం చేసి అందించారు.ఇదిలా ఉంటే ప్రస్తుతం విజయేంద్రప్రసాద్ మరో బయోపిక్ స్టోరీకి కథని సమకూర్చనున్నట్లు తెలుస్తోంది.2020లో గ్లోబల్ టీచర్ అవార్డ్ అందుకున్న మహారాష్ట్రకు చెందిన గవర్నమెంట్ టీచర్ రంజిత్ సిన్హా దిశలే కథను విజయేంద్రప్రసాద్ తయారు చేస్తున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు.
హిందీలో ఈ మూవీ తెరకెక్కుతుందని తెలిపారు.2020 ఏడాదికి గాను 196 ప్రపంచ దేశాల్లో బెస్ట్ టీచర్ గా రంజిత్ సిన్హా ప్రథమ స్థానం పొంది ఒక్కసారిగా పాపులర్ అయ్యారు.అలాంటి సాధారణ గవర్నమెంట్ టీచర్ గ్లోబల్ టీచర్ అవార్డు అందుకోవడంలో ఉన్న ఆసక్తికర కథని విజయేంద్ర ప్రసాద్ చెప్పనున్నారు.