రచయిత విజయేంద్ర ప్రసాద్ క్రేజ్ బాహుబలి, భజరంగి భాయిజాన్ సినిమాలతో ఒక్కసారిగా ఎక్కడికో వెళ్లింది.బాహుబలిని తెలుగుకే పరిమితం చేసిన విజయేంద్ర ప్రసాద్ భజరంగి భాయ్ జాన్ కథను హింది భాషలో తెరకెక్కేలా చేసి సల్మాన్ ఖాన్ కెరియర్ లో అతిపెద్ద హిట్ అందుకునేలా చేశాడు.
ఆ రెండు సినిమాలతో విజయేంద్ర ప్రసాద్ తెలుగు, హింది భాషల్లో ఎన్నో సినిమాలకు కథ అందించాలని ఆఫర్లు వచ్చాయి.
ఇక తాజాగా ఓ హింది సీరియల్ కోసం బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథ అందించడానికి సిద్ధమయ్యారట.
ప్రముఖ నటి సోనాలి బింద్రే భర్త గోల్డి బెహ్ల్ రూపొందిస్తున్న ఈ సీరియల్ లో ఒకప్పటి హీరోయిన్ రాధ కూతురు కార్తిక లీడ్ రోల్ లో నటిస్తుంది.జోష్ సినిమాతో తెరంగేట్రం చేసిన కార్తిక వెండితెర మీద సక్సెస్ కాలేదు.
ఇప్పుడు సీరియల్స్ కు పరిమితమవుతుంది.హింది నటుడు రాజీష్ దుగ్గల్ కూడా ఈ సీరియల్ లో నటిస్తున్నట్టు తెలుస్తుంది.
మరి సినిమాలకే కాదు సీరియల్స్ కు కూడా స్టోరీలందిస్తున్న విజయేంద్ర ప్రసాద్ సినిమాల్లా సీరియల్స్ కూడా సూపర్ హిట్ సాధించాలని కోరుకుందాం.