గ్యాంగ్ వార్ లకు బెజవాడ పెట్టింది పేరు.గతంలో అల్లర్లు తగ్గినా.
గత కొంత కాలంగా గ్యాంగ్ వార్ లు ఊపందుకున్నాయనే చెప్పుకోవచ్చు.ఇటీవల బెజవాడలో సందీప్, కేటీఎం పండు మధ్య జరిగిన గ్యాంగ్ వార్ స్థానికంగా సంచలనం రేపింది.
ఈ గ్యాంగ్ వార్ ను మరిచిపోక ముందే తాజాగా ఇంకో గ్యాంగ్ వార్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.మున్నా, రాహుల్ అనే ఇరువర్గాలు పరస్పర దాడులు చేసుకున్నారు.
కత్తులు, కర్రలతో దాడికి దిగారు.గత నెల 31న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ గ్యాంగ్ లో ఇప్పటివరకు పోలీసులు 11 మందిని అరెస్ట్ చేశారని తెలిపారు.
పాత కక్షలు పెంచుకున్న ఈ రెండు వర్గాలు మరోసారి దాడికి దిగారని పోలీసులు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.నాగుల్ మీరా అలియాస్ మున్నాకు రాహుల్ కు కేదారేశ్వర పేటలో ఇద్దరు గ్యాంగును మెయింటైన్ చేస్తున్నారు.
గతంలో కూడా ఈ ఇరువర్గాలు గొడవలకు పాల్పడ్డారు.పాత కక్షలు పెంచుకుని మరోసారి గత నెల 31న దాడులు చేసుకున్నారు.
మొదట రాహుల్ గ్యాంగ్ దాడి చేయడంతో ఆగ్రహంతో మున్నాగ్యాంగ్ కూడా అదే రోజు రాత్రి ఎదరు దాడికి దిగారు.కత్తులు, కర్రలతో గాయపర్చుకున్నారు.
గొడవపడి సైలెంట్ ఉంటడంతో ఈ విషయం బయటపడలేదన్నారు.కానీ, వినయ్ అనే యువకుడి మున్నా గ్యాంగ్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయట పడింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి ఇరువర్గాలకు చెందిన 11 మందిని అరెస్ట్ చేశారు.