నటుడు పృథ్వీరాజ్ కు విజయవాడ ఫ్యామిలీ కోర్టు షాకిచ్చింది.తన భార్య శ్రీలక్ష్మీకి ప్రతి నెల రూ.8 లక్షల భరణం చెల్లించాలని ఆదేశించింది.విజయవాడకు చెందిన శ్రీలక్ష్మీతో పృథ్వీరాజ్ కు 1984 లో వివాహమైంది.
వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు.అయితే 2016 ఏప్రిల్ 5న తనను ఇంటి నుంచి బయటకు పంపించి వేశారని.2017లో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది శ్రీలక్ష్మీ.తన భర్త నుంచి నెలకు రూ.8 లక్షల భరణం ఇప్పించాలని కోరింది.ఈ క్రమంలో విచారణ చేపట్టిన ఫ్యామిలీ కోర్టు.పృథ్వీరాజ్ తన భార్యకు నెలకు రూ.8 లక్షల రూపాయలతో పాటు ఇప్పటివరకు అయిన ఖర్చులు కూడా ఇవ్వాలని తీర్పు వెలువరించింది.ప్రతి నెలా 10వ తేదీ నాటికి భరణం చెల్లించాలని ఆదేశించింది.