దేశ వ్యాప్తంగా రేప్ల సంఖ్య భయంకరంగా పెరిగి పోతుంది.అమ్మాయిలు బయట తిరగాలంటే భయపడే పరిస్థితి వచ్చింది.
ఒంటరిగా వెళ్లిన అమ్మాయి ఎలాంటి పరిస్థితుల్లో వస్తుందని, ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అనే భయంతో చాలా మంది తల్లిదండ్రులు గుండెలు పట్టుకుని వెయిట్ చేస్తున్నారు.ఇలాంటి సమయంలో విజయవాడలో గత సంవత్సరం జరిగిన రేప్ కేసులో విజయవాడ కోర్టు సంచలన తీర్పు వచ్చింది.
నిందితుడికి 20 ఏళ్లు కఠిన కారాగార శిక్షను విధిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే గత సంవత్సరం మైనర్ బాలికపై కృష్ణారావు అనే వ్యక్తి అత్యాచారంకు పాల్పడ్డాడు.
ఆ వ్యక్తిని పోలీసులు ఫిబ్రవరిలో అరెస్ట్ చేశారు.ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది.
నిందితుడికి ఉరిశిక్ష వేయాలంటూ డిమాండ్ వచ్చింది.అయితే విజయవాడ కోర్టు మాత్రం అతడికి 20 ఏళ్ల శిక్షను విధిస్తూ తీర్పు ఇచ్చింది.
చాలా స్పీడ్గా ఈ తీర్పు రావడంపై ప్రశంసలు కురుస్తున్నాయి.మరో వైపు దిశా నిందితులను కూడా పోలీసులు కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఈ కేసు కూడా చాలా స్పీడ్గా విచారణ జరపాలంటూ జనలు కోరుకుంటున్నారు.