హుజురాబాద్ ఉప ఎన్నిక చివరి రోజైన నేడు మెదక్ మాజీ ఎంపి సినీనటి విజయశాంతి ఈటల రాజేందర్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.ఈ సంధర్బంగా ఆమె మాట్లాడుతూ.
మీకోసం కొట్లాడే వ్యక్తిని గెలిపించుకుంటార.లేక బానిసగా అవినీతి కి కాపలా వుండే తెరాస అభ్యర్థికి ఓటు వేస్తారా అని ప్రశ్నించారు.30 వ తేదీన దేవుడికి దండం పెట్టి ఈటెల ను గెలిపిద్దాం.కేసీఆర్ చాలా పెద్ద మాటలు అన్నారు.ప్రజలారా ఎక్కడ అవినతి జరిగిన చెప్పండి అని.ముఖ్యమంత్రి కేసీఆర్ నువ్వే పెద్ద అవినీతి పరుడివి.దుబాయిలో కోట్ల రూపాయలతో ఇండ్లు కొంటున్నారు.వేలాది మంది రైతులు చస్తుంటే ని కుటుంబానికి పదవులు పంచుతున్నావ్.కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల రూపాయలు దండుకున్నావ్.
ప్రాజెక్టుల పేరుతో ఊర్లకు, ఊర్లు నేలమట్టం చేసి కాంట్రక్టర్ల తో లక్షలు దండుకున్నారు.
దళితబంధు ఎన్నికల తరువాత కూడా రాదు.కేసీఆర్ ని నమ్మితే ఆయన ఉచ్చులో పడ్డట్టే.
హైదరాబాద్ లో వరదలకు కొట్టుకుపోయిన ఇండ్లకు 10000 ఇస్తా అన్నారు,ఇప్పుడు ఏమైంది.బతుకమ్మ చీరల పేరుతో కనీసం నాణ్యత లేని చీరలు ఇస్తున్నారు.
ఆడపడుచులకు అన్యాయం చేయడం సిగ్గు చేటు.అసలు 7 సంవత్సరాల కాలంలో ఎం చేశారు మీరు.
అసలు ముఖ్యమంత్రి గా ఉండటానికి సిగ్గు ఉందా నీకు.ముఖ్యమంత్రి పదవి ఎడమకాలితో సమానం అన్నావ్.
దిగిపో.రాజీనామా చెయ్.
ఢిల్లీలో చేసిన సర్వేలో చెత్త ముఖ్యమంత్రి, పనికి రాని ముఖ్యమంత్రి అన్నారు.భారత దేశంలో మొత్తం అందరికి తెలుసు ఎంత మోసగాడు,ఎంత దగా, ఎన్ని కుట్రలు చేస్తాడో కేసీఆర్.
కానీ తెలంగాణా ప్రజలకు తెలిడం లేదు.
ఉద్యమకారులనే మోసం చేసిన వ్యక్తి ఇవ్వాళ తెలంగాణ ప్రజలను మోసం చేయడం ఒక లెక్కా.కేసీఆర్ పాలసీ ఒకటే మద్యం ఇచ్చి ,పైసలు ఇస్తాడు,మందుతో పడుకోపెట్టి మోసం చేస్తున్నాడు.కేసీఆర్ ని పూర్తిగా గద్ద దింపాలి.
యావత్ తెలంగాణ ను కాపాడుకోవాలి.కేసీఆర్ లక్ష కోట్ల రూపాయలు దండుకున్నారు కదా, బైటకు తీస్తే అందరికి గ్యాస్ సీలిండర్లు ఉచితంగా రావా.ఈటెల రాజేందర్ వైపు న్యాయం ఉంది,కేసీఆర్ వైపు అన్యాయం ఉంది,రాక్షస,నిజం పాలన ఉంది.4 లక్షల కోట్లు అప్పు ఎందుకు చేసాడు కేసీఆర్.ఓటర్లరా ఒక్కటే నీళ్లు,నిధులు,నియామకాలు అన్ని రావాలంటే కేసీఆర్ ని గద్ద దింపాలి.ఈటెల రాజేందర్ ను గెలిపించుకుంటే తెలంగాణ ఆత్మగౌరవం నిలబడుతుంది.ఈ ఎన్నికతో.కేసిఆర్ ను రాజకీయాల నుండి శాశ్వతంగా తోసేయండి అని పిలుపునిచ్చారు.