దాదాపు రెండు దశాబ్దాల క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్గా ఒక వెలుగు వెలిగిన విజయశాంతి ఆ తర్వాత రాజకీయాలు మరియు ఇతరత్ర కారణాల వల్ల సినిమాలకు దూరం అయ్యింది.మళ్లీ ఇన్నాళ్లకు విజయశాంతి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది.
రాజకీయాలు ఈమద్య కాలంలో పెద్దగా వర్కౌట్ కాని కారణంగా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి మరోసారి తన సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.ఇప్పటికే అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్బాబు హీరోగా, అనీల్ సుంకర నిర్మించబోతున్న చిత్రంలో విజయశాంతి ఎంపిక అయ్యిందని, ఓకే చెప్పిందనే వార్తలు వస్తున్నాయి.
ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగిన రాములమ్మ విజయశాంతి రీ ఎంట్రీతో ఎంత పారితోషికం తీసుకుంటుందనే విషయమై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది.సాదారణంగా అయితే క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించే వారికి రోజు వారి పారితోషికం ఇస్తూ ఉంటారు.
వారి స్థాయిని బట్టి పది వేల నుండి అయిదు లక్షల వరకు ఇస్తూ ఉంటారు.విజయశాంతికి అలా కాకుండా ఎక్కువ రోజులు ఆమె డేట్లు కావాలి కనుక హీరో, హీరోయిన్స్కు పారితోషికం మాట్లాడుకున్నట్లుగా ఇచ్చేందుకు సిద్దం అయ్యారు.
మొదట విజయశాంతి రెండు కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందని తెలుస్తోంది.అయితే చిత్ర యూనిట్ సభ్యులు ఫైనల్గా ఆమెకు కోటిన్నర రూపాయల పారితోషికంను ఫిక్స్ చేసినట్లుగా సమాచారం అందుతోంది.ఈ కోటిన్నరతో పాటు ఆమె మెయింటెన్స్ మరియు అసిస్టెంట్లకు జీతాలను కూడా నిర్మాణ సంస్థ భరించనుంది.అనీల్ రావిపూడి దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తిగా ఉన్న విజయశాంతి ఆ తర్వాత కూడా సినిమాలు చేస్తుందా లేదా అనేది చూడాలి.