బిజెపి పార్టీ నాయకురాలు విజయశాంతి టిఆర్ఎస్ పార్టీ పై సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడు సంవత్సరాలు కావస్తున్నా గాని టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి ఏమీ చేయలేదని దోచుకోవడమే జరిగిందని ఆరోపణలు చేశారు.
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పాదయాత్రలో పాల్గొన్న విజయశాంతి ఈ వ్యాఖ్యలు చేశారు.ఇదే తరుణంలో ప్యాకేజీలో భాగంగానే కాంగ్రెస్ నాయకులు టిఆర్ఎస్ లోకి వెళ్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ అటు ఢిల్లీలో ఇటు గల్లీలో ను లేదని పేర్కొన్నారు.ఎన్నికలు అంటే కెసిఆర్ కప్పుడే పథకాలు గుర్తొస్తాయి అని, హుజురాబాద్ ఉప ఎన్నికలలో ఈ విధంగానే కెసిఆర్ వ్యవహరిస్తున్నారని.
పథకాలు చెప్పి ప్రజలను మోసం చేయడానికి రెడీ అవుతున్నారని విజయశాంతి సీరియస్ కామెంట్లు చేశారు.బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొన్న విజయశాంతి.
టిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.