ఎంత గొప్ప స్నేహితులు అయినా… రాజకీయాల్లోకి వచ్చేసరికి బద్ద శత్రువులుగా మారిపోతుంటారు.బద్ద శత్రువులు కూడా … స్నేహితులు అయిపోతుంటారు.
ఇటువంటివి అన్నీ ఈ రాజకీయాల్లో కామన్.ఇక తెలంగాణా రాజకీయాల విషయానికి వస్తే… మహాకూటమి ఏర్పాటుతో రాజకీయ వర్గాల్లో చిత్ర విచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
సినిమాలో హిట్ ఫెయిర్ గా మంచి మంచి సినిమాల్లో నటించిన ఆ ఇద్దరూ ఆ తరువాత రాజకీయాల కారణంగా… రాజకీయ ప్రత్యర్ధులుగా మారిపోయారు.కానీ చాలా కాలం తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఎన్నికల ప్రచారం మొదలు కాబోతోంది.
ఇంతకీ ఆ ఇద్దరు బాలకృష్ణ – విజయశాంతి.
ఇద్దరిదీ చెరో దారి అన్నట్టుగా ఉండేది.బాలకృష్ణ టిడిపిలో ఉండగా, విజయ శాంతి సొంతంగా పార్టీ పెట్టి ఆపై బిజెపిలో చేరి ఆతర్వాత టిఆరెస్ లో కెళ్లి ఇలా చాలా రాజకీయ అనుభవం సంపాదించారు.ప్రస్తుతానికి ఆమె కాంగ్రెస్ లో ఉన్నారు.
ఇద్దరికీ జనాన్ని ఉర్రూతలూగించే క్రేజ్ ఉంది వారి స్పీచ్ లకు చప్పట్ల జడివాన కురుస్తుంది ఇలా ఇద్దరూ ఎవరికి ఎవరూ తీసిపోనంత సరిసమానంగా క్రేజ్ సంపాదించుకున్నారు.దేశంలో ఏర్పడిన అనూహ్య రాజకీయ పరిస్థితులు వారిద్దరినీ ఒకే కూటమిలో ఇమిడ్చాయి.
ప్రజాస్వామ్య అనివార్యత పేరుతో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో చేతులు కలిపి తెలంగాణలో ఎన్నికల బరిలోకి దిగడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది.
మొన్నటి వరకూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న ఈ నటులిద్దరూ ఇప్పుడు ఒకే వేదికను పంచుకుంటారా ? ఉమ్మడి శత్రువు అయిన టీఆర్ఎస్, బిజెపీలను ధీటుగా ఎదుర్కొంటారా అనే సందేహం కలుగుతోంది.చంద్రబాబు, రాహుల్ ఇద్దరూ కలసి హైదరాబాద్ శివార్లలో రోడ్ షోలలో పాల్గొనే విధంగా ఎన్నికల ప్రచారం డిజైన్ చేస్తోంది మహా కూటమి దాంతో టిడిపి నుంచి బాలకృష్ణ, కాంగ్రెస్ నుంచి విజయ శాంతి కూడా ఒకే వేదికను పంచుకోబోతున్నారు.సెటిలర్లు ఎక్కువగా ఉండే ఏరియాల్లో కాంగ్రెస్, టిడిపి కలిపి చేసే ప్రచారంలో బాలయ్య, విజయ శాంతి కూడా పాల్గొంటారు.
ఈ ఇద్దరి ప్రచార హోరుతో… కూటమి అభ్యర్థుల విజయావకాశాలు మెరుగవుతాయని ఆ పార్టీ నేతలు ఆశలు పెట్టుకున్నారు.