భారతీయ నటి, రాష్ట్ర ముఖ్యమంత్రి గా మంచి పేరు సొంతం చేసుకున్న జయలలిత గురించి అందరికీ తెలిసిందే.ఈమె రాజకీయాల్లోనే కాకుండా తన కెరీర్ ను సినీ పరిశ్రమలో కూడా పరిచయం చేసింది.
ఈమెకు హీరోయిన్ గా మంచి పేరు సినీ పరిశ్రమ లో ఉండగా, రాజకీయరంగంలో ఏకంగా అమ్మ గా పిలుచుకునే పేరు ఉంది.ఇదిలా ఉంటే ఫిబ్రవరి 24న జయలలిత 73 వ జయంతి సందర్భంగా ఆమె గురించి కొన్ని విషయాలు బయటికి రాగా ఎందరో రాజకీయ నాయకులు, సినీ నటులు ఆమెను గుర్తు చేసుకుని కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు.
ఇదిలా ఉంటే విజయశాంతి ప్రాణాలు జయలలితనే కాపాడిందట.
తెలుగు సినీ నటి, బిజెపి నాయకురాలు విజయశాంతి జయలలిత జయంతి సందర్భంగా కొన్ని భావోద్వేగాలను అభిమానులతో పంచుకుంది.
జయలలిత జయంతి సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమెతో కొన్ని ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.అంతేకాకుండా ఓ ఎమోషనల్ పోస్ట్ చేయగా ఇప్పటి వరకు తెలియని నిజం బయటపెట్టింది విజయశాంతి.
ఆమెతో ఉన్న తన స్నేహబంధాన్ని గురించి తెలుపుతూ అదే సమయంలో ఆమె టెర్రరిస్ట్ ల హిట్ లిస్ట్ లో ఉన్న విషయాన్ని తెలిపింది.అమ్మ మీరెక్కడో రాజకుమార్తెగా మళ్ళీ జన్మించే ఉంటారు.అయినప్పటికీ మా అందరికీ తెలిసిన రోజుగా మీ పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ మీతో పంచుకున్న తీపి గుర్తులు ఎప్పటికీ అలాగే ఉంటాయని తెలిపింది.అంతేకాకుండా మత తీవ్రవాదుల హిట్ లిస్ట్ లో విజయశాంతి టార్గెట్ అయినప్పుడు కొన్నేళ్లు తన భద్రత కోసం జయలలిత విప్లవ నాయకి జయలలితకి ప్రియమైన చెల్లెలు ప్రచారంలో ఫిరంగి అంటూ ఆమె ఇచ్చిన బిరుదు గౌరవప్రదమైన పిలుపు జ్ఞాపకం మిగిలే ఉంటుందని విజయశాంతి ఎమోషనల్ అయ్యింది.
ఒకప్పుడు బీజేపీ జాతీయ నాయకుడు ఎల్.కె.అద్వానీ1998లో తమిళనాడులోని కోయంబత్తూరు పర్యటించిన సమయంలో ఆయన పై బాంబు దాడులు జరిగాయి.ఆ సమయంలో విజయశాంతి బీజేపీ నాయకురాలిగా జాతీయ నేతలతో కలిసి పాల్గొన్నది.
దీంతో అద్వానీ బాంబు దాడి కేసులో ప్రధాన నిందితుడైన ఉగ్రవాది డైరీలో మరో వ్యక్తిను టార్గెట్ చేయగా అందులో విజయశాంతి పేరు బయటపడింది.దీంతో ఆమెను కాపాడడానికి తమిళనాడు సీఎం గా ఉన్న జయలలిత విజయశాంతి ఇంటివద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేసింది.
ఈ విధంగా తనను కాపాడిదంటూ భావోద్వేగానికి గురైంది విజయశాంతి.