గతంలో ఎప్పుడు లేని విధంగా కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి అధికార టీఆర్ఎస్ పై సమయం వచ్చినప్పుడల్లా విమర్శలు చేస్తూ వస్తోంది.సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కామెంట్స్ చేస్తూ ప్రజల్లో ఆలోచన కలిగిస్తున్న విజయశాంతి మీడియా ముందు కూడా సీఎం కేసీఆర్తో పాటు టీఆర్ఎస్ నాయకులపై తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేస్తోంది.
ఉన్నట్లుండి విజయశాంతిలో ఇంత ఆవేశం ఏంటో అంటూ ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులే చెవులు కొరక్కుంటున్నారు.ఇదే సమయంలో ఆ పార్టీ నాయకుల్లో ఒక ఆసక్తికర విషయం ఒకటి చర్చకు వస్తోంది.
అదేంటి అంటే త్వరలో టీ పీసీసీ ఎంపిక జరుగబోతుంది.ఆ రేసులో విజయశాంతి ఉంది.
అందుకే ఇప్పుడు ఈ హడావుడి అంటున్నారు.</br>
కాంగ్రెస్ నుండి విజయశాంతి బీజేపీలో జాయిన్ అవ్వనుందని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి.
ఆ సమయంలో ఆమె స్వయంగా మాట్లాడుతూ తనకు కాంగ్రెస్ తప్ప మరే పార్టీలో రాజకీయాలు చేయాలని లేదు అంటూ చెప్పుకొచ్చింది.ఇదే సమయంలో ఈమె సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చింది.
సినిమాల్లో నటిస్తూ కూడా రాజకీయంగా కూడా చాలా క్రియాశీలకంగా ఈమె వ్యవహరిస్తుంది.ఈమె తీరుతో అంతా కూడా ఆశ్చర్యపోతున్నారు.
ఈమె దూకుడు చూస్తుంటే అధిష్టానం వద్ద మంచి పేరు దక్కించుకున్న పార్టీ చీప్ పదవిని దక్కించుకునేట్లుగానే కనిపిస్తుంది.అయితే ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పార్టీ సీనియర్ మగ పురుషులు రాములమ్మను పీసీసీ చీప్ గద్దెను ఎక్కనిచ్చేది అనుమానమే అనే టాక్ కూడా వినిపిస్తుంది.
మరి కాలం ఏం నిర్ణయిస్తుందో చూడాలి.