తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న హుజూర్ నగర్లో ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది.అక్కడ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరిగిన విషయం తెల్సిందే.
అయితే భారీ వర్షం కారణంగా ఏవియేషన్ అధికారులు హెలికాప్టర్లో ప్రయాణం సరికాదని అనుమతులు ఇవ్వలేదు.దాంతో కేసీఆర్ సభ రద్దయ్యింది.
ఈ విషయమై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి స్పందిస్తూ కేసీఆర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది.ఈ సందర్బంగా ఆమె కేసీఆర్ ఓటిమని అంగీకరించాడంది.
విజయశాంతి.కేసీఆర్ హుజూర్ నగర్ పర్యటన రద్దుకు మరో కారణం ఉందని, ఆయన వర్షం కారణంగా తన సభను రద్దు చేసుకోలేదు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం ఎక్కడ పడుతుందో అనే ఉద్దేశ్యంతో ఆయన తన సభను వద్దనుకున్నాడు.రెండు వందల కిలోమీటర్లు ఉండే ప్రాంతంకు హెలికాప్టర్ ద్వారా కాకుంటే రోడ్డు మార్గంలో కూడా వెళ్లవచ్చు.
అలాంటిది కేసీఆర్ వెళ్లలేదు అంటే ఇక్కడే ఆయన తన ఓటమిని ఒప్పుకున్నాడు అంటూ విజయశాంతి చెప్పుకొచ్చింది.ఎన్నికల ప్రచారంకు వెళ్లకుండా మొహం చాటేయడం అంటే ఆయన తన ఓటమిని ముందే ఊహిస్తున్నాడని ఆమె పేర్కొంది.