తెలంగాణ ఫైర్ బ్రాండ్ … లేడీ అమితాబ్ విజయశాంతికి కోపం ఓ రేంజ్ లో వచ్చింది.ప్రస్తుతం ఆమె తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా… మహాకూటమి అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొంటున్నారు.
ఆమె .ఆమెకు కాంగ్రెస్ పార్టీ తరపున స్టార్ ప్రచార కర్త అని ప్రకటించింది కాంగ్రెస్.అయితే… అటువంటి ఈమెకు ఎన్నికల ప్రచారంలో తన బొమ్మ వేయకపోతే విజయశాంతికి కోపం రాదా? ఆమె ఈ విషయాన్ని దాచుకోకుండా ఏకంగా ప్రెస్ నోట్ విడుదల చేశారట.
టిఆర్ఎస్ మంత్రివర్గంలో ఒక మహిళా మంత్రి కూడా లేరని విమర్శిస్తున్న మనం ,కాంగ్రెస్ లో ఒక్క మహిళా నేత లేరని అనుకుంటున్నారా అంటూ… ప్రశ్నించారు.సోనియాగాంధీ మీటింగ్ సందర్భంగా వేసిన ప్లెక్సీలో ఒక మహిళా నేత బొమ్మ కూడా ఎందుకు వేయలేదని ఆమె ప్రశ్నించారు.ఇతరులను విమర్శించే ముందు మనం ఏం చేస్తున్నామో ఆలోచించుకోవాలంటూ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సిలో ఒక్క మహిళా నాయకురాలి ఫోటో కూడా లేకపోవడం ఏంటని ప్రజలు ఆశ్చర్యపోతున్నారని తెలిపారు.చెప్పడానికే నీతులు పాటించడానికి కావా అంటూ జనాలు విమర్శిస్తున్నారని అన్నారు.
ఈ సభలో మగవాళ్లు మాత్రమే ఉంటారా.మహిళలు కూడా సభకు హాజరవుతారు కదా అని విజయశాంతి ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు.