టిడిపి అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పైన విమర్శలు చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారు రాజ్యసభ సభ్యుడు, వైసిపి ప్రధాన కార్యదర్శి, విజయసాయిరెడ్డి.సందర్భం ఉన్నా, లేకపోయినా తనదైన శైలిలో విజయసాయిరెడ్డి లోకేష్, చంద్రబాబు ఇద్దరినీ ఉద్దేశించి వ్యంగ్యంగా విమర్శలు చేస్తూనే వస్తుంటారు.
తమ పార్టీ పై టిడిపి నాయకులు ఎవరు విమర్శలు చేసినా, దానికి లోకేష్ చంద్రబాబు ఇద్దరినీ ముడిపెట్టి మరీ వ్యంగ్యంగా విమర్శించడం, ట్విట్టర్ ద్వారా రకరకాల పంచ్ డైలాగులు వేస్తూ, వారి పరువు ను తీసేస్తూ ఉంటారు విజయసాయిరెడ్డి.వారిద్దరినీ విమర్శించే స్థాయి లో మరే నాయకుడు చంద్రబాబును లోకేష్ ను విమర్శించరు అంటే అతిశయోక్తి కాదు.
తాజాగా లోకేష్ పై వ్యంగ్యంగా విమర్శలు చేశారు విజయసాయిరెడ్డి.గత కొంతకాలంగా టిడిపి ఆధ్వర్యంలో అమరావతి ఉద్యమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈ ఉద్యమంలో కొందరు ప్రాణాలు కోల్పోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.నిన్ననే ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించిగా, రాజధాని అమరావతి నుంచి తరలి వెళ్ళిపోతుందనే ఆందోళనతో ఆయన మరణించినట్లుగా తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శలు చేయడం, దీనికి వైసీపీకి ముడిపెట్టి వైసీపీ కారణంగానే, ఈ మరణం చోటు చేసుకుందనే విధంగా విమర్శలు చేయడంపై విజయ సాయి రెడ్డి స్పందించారు.
“ బాబు నుండి అవినీతి, అసమర్ధత, అసత్యం వారసత్వంగా తీసుకున్న చినబాబు ఇప్పుడు బాబునే మించిపోయాడు.వయోభారంతో సంభవించే సహజ మరణం ను కూడా తన రియల్ ఎస్టేట్ అడ్డాగా, అమరావతి లిస్టులో వేసి దుష్ప్రచారానికి దిగాడు.తండ్రిలాగే మాలోకం మతి చెడిపోయింది.ఇంకెంతకాలం అవుట్ డేటెడ్ బుర్ర వాడుతావు మాలోకం ? ” అంటూ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో విమర్శించారు.ఇక మరో ట్వీట్ లో మీడియాపైన విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు.
” ఆ పసి పిల్లల మోముల్లో వెల్లివిరిసిన ఆనందం పచ్చమీడియాకు కనిపించడం లేదు.జగనన్న విద్యా కానుక కింద కిట్లు పొందిన విద్యార్థులు దసరా, దీపావళి ఒకేసారి వచ్చినట్లు సంబరపడుతున్నారు.వెలుగు దివ్వెల్లా మెరిసిపోతున్నా, వారి సంతోషాన్ని చూపించడానికి భజన మీడియా కు మనసొప్పడం లేదు” అంటూ గట్టిగానే చురకలు అంటించారు.