సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ పై స్పందించిన విజయసాయిరెడ్డి..!!

హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ వార్త ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది.అతి వేగం కారణంగా కేబుల్ బ్రిడ్జి పై ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించి కేసు కూడా నమోదు చేయడం జరిగింది.

 Vijayasaireddy Responds To Sai Dharam Tej Accident Vijayasaireddy, Sai Dharam Te-TeluguStop.com

మరోపక్క సాయి ధరంతేజ్ ప్రమాదానికి గురైన ప్రాంతంలో ఇసుక ఉండటం వల్లే.బైక్ స్కిడ్ అయ్యి ఈ ప్రమాదం జరిగినట్లు మరికొంతమంది అంటున్నారు.

పరిస్థితి ఇలా ఉంటే ఇప్పటికే చాలా మంది ఇండస్ట్రీలో సెలబ్రిటీలు కొంత మంది రాజకీయ నాయకులు.ఈ ఘటనపై రియాక్ట్ అవటం మాత్రమే కాక మరి కొంతమంది హాస్పిటల్ కి వెళ్లి మరి.సాయి ధరమ్ తేజ్ ని పరామర్శించారు.

ఈ తరుణంలో వైసీపీ సీనియర్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సాయి ధరమ్ తేజ్ కి జరిగిన యాక్సిడెంట్ గురించి రియాక్ట్ అయ్యారు.

ప్రమాదానికి గురైన యువ హీరో సాయిధరమ్ తేజ్ కోలుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు.అపోలో ఆసుపత్రిలో ఆయన కోలుకుంటున్నారని తెలిపారు.బైక్ పై వెళ్లేటప్పుడు ఆయన హెల్మెట్ ధరించడం సంతోషకరమని చెప్పారు.యువత బైక్ పై వెళ్తున్నప్పుడు స్పీడ్ తగ్గించుకోవాలని సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube