వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి చంద్రబాబు అదే రీతిలో లోకేష్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు అతి పెద్ద టెర్రరిస్టు అని పేర్కొన్నారు.
గంజాయి వ్యాపారంలో లోకేష్, చంద్రబాబుకి వాటాలు ఉన్నాయని విజయసాయి రెడ్డి ఆరోపించారు.ఇప్పుడు దొంగే… దొంగ అరిచినట్లుగా వీళ్ళ వ్యవహారం ఉందని పేర్కొన్నారు.
చంద్రబాబు మాదక ద్రవ్యాల వ్యాపారం చేశారని చట్టాలను ఉల్లంఘించారని… ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని డ్రగ్స్ వ్యాపారం వెనకాల లోకేష్ చంద్రబాబు హస్తం ఉందని విజయసాయిరెడ్డి ఆరోపించారు.
ఇదే క్రమంలో చంద్రబాబు తనని ఎక్కడ హాని చేస్తాడో… భయపడి పట్టాభి మాల్దీవులకి పారిపోయాడని విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.తన స్వార్ధపూరిత రాజకీయాలు కోసం చంద్రబాబు.తనని బలి చేస్తాడేమో అనే భావనతో.
పట్టాభి కుటుంబంతో కలిసి.మాల్దీవులకు పారిపోయాడు అని ఆరోపించారు.
చంద్రబాబు బ్యాక్ గ్రౌండ్ చూస్తే.గతంలో ఈ మాదిరిగానే వ్యవహరించారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
అదే రీతిలో రాజ్యాంగ సంస్థల పై ఇష్టానుసారంగా మాట్లాడకుండా కొత్త చట్టం తీసుకురావాలని సూచించారు.రాజ్యాంగ పెద్దలపై ఇష్టానుసారంగా మాట్లాడితే శిక్షించే రీతిలో కొత్త చట్టం ఉండాలని.
వచ్చే పార్లమెంటులో ఈ విషయంపై పోరాడతం… అవసరమైతే ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతామని విజయసాయిరెడ్డి తెలిపారు.