వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2 గా విజయ సాయి రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే.అప్పట్లో విచారణ సమయంలో సిబిఐ అధికారులు మొట్ట మొదటిసారిగా.
విజయసాయి రెడ్డిని అదుపులోకి తీసుకోవడం తెలిసిందే.ఆ తర్వాత బెయిల్ రావటం వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వడం ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న విజయసాయి రెడ్డి.
మరోపక్క సిబిఐ విచారణ ఎదుర్కొంటున్నారు.ప్రస్తుతం బెయిల్ పై బయట ఉండటంతో.
తాజాగా విదేశాలకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలని.సీబీఐ న్యాయస్థానంలో విజయసాయిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
అప్పట్లో బెయిల్ వచ్చిన సమయంలో.దేశం విడిచి వెళ్లరాదని షరతు విధించడంతో తాజాగా న్యాయస్థానాన్ని అనుమతి కోరుతూ దుబాయ్, ఇండోనేషియా వెళ్లాల్సి ఉందని పిటిషన్ లో వెల్లడి చేశారు.
ఇందుకోసం రెండు వారాలు అనుమతినివ్వాలని.సిబిఐ న్యాయస్థానాన్ని కోరారు.ఈ క్రమంలో సీబీఐ అధికారులు కౌంటర్ దాఖలు చేయాలని.న్యాయస్థానం తెలపటంతో.
మరింత సమయం కావాలని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు.ఈ క్రమంలో తదుపరి విచారణ.
ఈనెల 16వ తారీకు కి వాయిదా వేయడం జరిగింది.
.