తప్పు ఎవరు చేసిన తప్పే ఎంతటి వారైన చట్టం ముందు సమానులే అని చెప్పుకోవడానికి బాగుంటుంది.కానీ ఆచరనకు వచ్చే సరికి పరపతి, పలుకుబడి చూసి నోరు మెదపరు అని ఏపీ ప్రజలు అనుకుంటున్నారట.
తప్పుచేసిన వారిని తన మాటలతో కోత కోసే విజయసాయిరెడ్ది, ప్రతి పక్షాలకు నిద్దుర లేకుండా చేసే విజయసాయి రెడ్ది ప్రస్తుతం తాను చేసిన మిస్టేక్ వల్ల ప్రజల నోళ్లో నానుతున్నారట.
ఇంతకు అసలు విషయం ఏంటంటే.
ఏపీలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భాగంగా విశాఖలో ప్రచారాన్ని నిర్వహిస్తున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారట.ఈ క్రమంలో విజయసాయి, అవంతి శ్రీనివాస్ లతో పాటు వారి వెనుక బైక్ లపై వస్తున్న వారెవరూ కూడా హెల్మెట్ ధరించలేదట.
దీంతో నెటిజన్స్ బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘించారని మండిపడుతున్నారట.ఇదిలా ఉండగా ఏపీలో హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే రూ.1000 జరిమానా విధిస్తున్నారట ట్రాఫిక్ పోలీసులు.మరి ఇలా హెల్మెట్ లేకుండా ర్యాలీ నిర్వహించిన వీరందరికి కూడా ఫైన్ విధించాలని డిమాండ్ చేస్తున్నారట.