అందుకే ఆ ఎంపీ బట్టలు చించుకుంటున్నాడు

రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిపై వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి తనదైన శైలిలో వెటకారపు విమర్శలు చేశారు.ప్రస్తుతం రాజధాని అంశం ఏపీలో హాట్ టాపిక్ గా మారడంతో పాటు రాజకీయ పార్టీల మధ్య మరో యుద్ధానికి తెర తీసింది.

 Vijayasai Reddy Sujana Chowdary Tdp Chandrababu Naidu-TeluguStop.com

ఏపీలో మూడు రాజధానులు అంటూ జగన్ అసెంబ్లీలో ప్రకటించినప్పటి నుంచి ఈ వివాదం ఉంది తాజాగా దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు ప్రతిపక్ష నేత చెలరేగుతూనే ఉంది.చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుత బీజేపీ లో ఉన్న రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిలను ఉద్దేశించి విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు.

అమరావతి నిర్మాణం భోగాపురం ఎయిర్ పోర్ట్ ఇంకా ఏ విషయం అయినా చంద్రబాబు హయాంలో తన వాళ్లకు ముందుగానే లీకులు ఇచ్చి ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని అది ఆయన పేటెంట్ అంటూ విజయసాయి విమర్శలు చేశారు.పైగా టీడీపీ నాయకులు తమ పార్టీపై నిందలు వేస్తున్నారు అంటూ ఆయన మండిపడ్డారు.

రాష్ట్రాల రాజధానులు కేంద్రం పరిధిలో ఉండదని, చట్టసభల సభ్యులు అందరికీ ఈ విషయం తెలుసునని, బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు కూడా ఈ విషయంలో స్పష్టంగా తెలుసుననే విషయాన్ని విజయసాయి గుర్తు చేశారు.సుజనా చౌదరి, ఆయన గురువు చంద్రబాబు కి అమరావతి చుట్టుపక్కల పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి కాబట్టే కేంద్రం చూస్తూ ఊరుకోదు అంటూ ఆయన బట్టలు చింపుకుంటున్నారు అంటూ విమర్శలు చేశారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube