తమ మీద ఎదురుదాడి చేసే వారి మీద విమర్శలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ ను వేదికగా చేసుకుని పంచ్ డైలాగులతో ట్విట్లు పెడుతుంటారు విజయసాయి.ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మీద ట్విట్లు పెట్టడమన్నా, తీవ్ర స్థాయిలో విమర్శలు చేయాలన్నా విజయసాయి రెడ్డి స్పీడ్ గా స్పందిస్తుంటారు.
అదే విధంగా లోకేష్ మీద విజయసాయి రెడ్డి విమర్శలు చేసారు.పప్పూ నీది సార్ధక నామధేయం అంటూ ట్వీట్ చేశారు.‘జనాభా లెక్కలు పదేళ్లకు ఒకసారి జరుగుతాయి.దాని కోసం ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోని ఎన్నార్సీ అంటూ అర్థం చేసుకున్నావంటే నీ ఇంగ్లిషు, నీ జ్ఞానం చూసి మీ నాన్న నవ్వాలో, ఏడవాలో తెలియక రోజూ ప్రెస్ మీట్లల్లో ఫ్రస్టేట్ అవుతున్నాడు’ అంటూ విమర్శలు చేసారు.
పనిలో పనిగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి మీద విమర్శలు చేశారు.ఆయనపై సీబీఐ, ఈడీ దర్యాప్తు జరగకపోతే ఈ దేశంలో చట్టం, న్యాయం మీద నమ్మకం పోతుందన్నారు.విచారణ అడిగితే అందుకు తాను ‘సిద్ధం’ అని చెప్పకుండా తన జీవితం ‘తెరిచిన పుస్తకం’ అంటున్నాడని విమర్శించారు.‘ఔను అది తెరిచిన పుస్తకం.బ్యాంకులను వేల కోట్లలో ముంచిన పుస్తకం’ అంటూ విమర్శలు చేశారు.