ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగిచాలంటూ భూములు ఇచ్చిన రైతులు నిరసనలు చేపట్టారు.రాజధాని వికేంద్రీకరణతో అమరావతికి అన్యాయం జరుగుతుందని ప్రభుత్వంపై విపక్ష నేతలు మండిపడుతున్నారు.
కాగా, వికేంద్రీకరణ బిల్లును సవాల్ చేస్తూ హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ మేరకు రాజధాని అంశంపై సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.
రాజధాని వికేంద్రీకరణతో అమరావతి అభివృద్ధికి వచ్చిన నష్టమేమి లేదని విజయసాయిరెడ్డి అన్నారు.మూడు రాజధానులతో అమరావతి మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.
సీఎం జగన్ ఏఎమ్ఆర్డీఏ సమీక్ష చూస్తే ఆ విషయం ఎవరికైనా అర్ధమవుతుందని చెప్పుకొచ్చారు.రాజధాని వికేంద్రీకరణతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని విజయసాయిరెడ్డి అన్నారు.
అమరావతి రైతులకు ఎట్టి పరిస్ధితుల్లో అన్యాయం జరగదని.కానీ, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు మాత్రం ఎవరూ హామీ ఇవ్వలేరని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.