తెలుగులో ఒకప్పుడు దాదాపుగా అందరి ప్రముఖ హీరోలతో నటించి లేడీ సూపర్ స్టార్ గా పేరు పొందినటువంటి నటి విజయశాంతి గురించి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తెలియని వారు ఉండరు.అయితే ప్రజలకు సేవ చేయాలనే మంచి మనసుతో రాజకీయాల్లోకి వెళ్లి దాదాపుగా 13 ఏళ్ల తర్వాత సరిలేరు నీకెవ్వరు అనే చిత్రంతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చారు విజయశాంతి.
ఈ చిత్రంలో ఓ ఆర్మీ జవాన్ తల్లి పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు.
అయితే తాజాగా విజయశాంతి సినిమాల గురించి చేసినటువంటి ఓ ట్వీట్ నెట్టింట్లో విజయశాంతి అభిమానులను కలవరపెడుతోంది.
తాజాగా విజయశాంతి నా నట ప్రస్థానానికి 1979 కల్లుకుల్ ఇర మ్, కిలాడి కృష్ణుడు నుండి నేటి 2020 సరిలేరు నీకెవ్వరు వరకు నన్ను ఇంత గొప్పగా ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులకు అభిమానులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.అంతేగాక ప్రజా జీవన పోరాటంలో నా ప్రయాణం మళ్లీ మరో సినిమా చేసే సమయం సందర్భం నాకు కనిపిస్తుందో లేదో నాకు కూడా తెలియదు ఇప్పటికీ ఇక సెలవు అని ట్వీట్ చేశారు.
దీంతో రాములమ్మ అభిమానులు మళ్లీ విజయశాంతి సినిమా లో నటిస్తుందో లేదో అని కొంత మేర కలవరపడుతున్నారు.
అయితే ఇది ఇలా ఉండగా కొంతమంది మాత్రం రాములమ్మ ఇక మళ్లీ సినిమాల్లో నటించకూడదని తీసుకున్న నిర్ణయం వల్లనే ఇలా ట్వీట్ చేసిందని అంటున్నారు.అయితే మరికొందరు ప్రస్తుతం రాములమ్మ పెడుతున్న ఎటువంటి కండిషన్లు మరియు భారీ పారితోషికం వంటి అంశాలను దర్శకనిర్మాతలని కలవరపెడుతున్నాయని అందువల్లనే ఆమె ఆమెకు అవకాశం ఇవ్వాలి అంటే కొంతమేర ఆలోచిస్తున్నట్లు, దీంతో రావులమ్మ అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయని అభిప్రాయపడుతున్నారు.అయితే ఏదేమైనప్పటికీ రాములమ్మ మాత్రం తాను నటించే పాత్రల విషయంలో గాని పారితోషికం విషయంలో గాని అసలు తగ్గకపోవడం వల్లనే రాములమ్మకి అవకాశాలు రావడం లేదని కొందరు అంటున్నారు.
ఏదేమైనప్పటికీ సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నప్పటకి అదే చిత్రంతోనే తన సినీ ప్రస్థానానికి రాములమ్మ ముగింపు పలుకుతూ ఉండటంతో రాములమ్మ అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.