వైకాపాలో నెం.2 గా కొనసాగుతున్న ఎంపీ విజయసాయి రెడ్డి ఒక వైపు రాజకీయాలు చేసుకుంటూ మరో వైపు వ్యాపారాలు కూడా చేస్తున్న విషయం తెల్సిందే.వైఎస్ జగన్కు సంబంధించిన దాదాపు అన్ని వ్యాపారాలకు సంబంధించిన విషయాలు విజయసాయి రెడ్డి చూసుకుంటూ ఉంటాడు.మీడియాలో తమదైన ముద్ర ఉండాలనే ఉద్దేశ్యంతో ఎక్కువ శాతం యూట్యూబ్ ఛానెల్స్తో పాటు, న్యూస్ ఛానెల్స్ను కూడా విజయసాయి తన ఆధీనంలో ఉంచుకున్నాడు.
యూట్యబ్లో ఎక్కువగా వ్యూస్ ఉన్న ఛానెల్స్ను కొనేయడంతో పాటు, చిన్న చిన్న ఛానెల్స్ను విజయసాయి టేకోవర్ చేస్తున్నాడు.గత కొన్ని సంవత్సరాలుగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఆద్వర్యంలో నడుస్తున్న రాజ్ న్యూస్ ఛానెల్ను విజయసాయి రెడ్డి కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.
రాజ్ న్యూస్ ఛానెల్ అనేది ఒకటి ఉందని కొందరికి తెలియనే లేదు.అయినా కూడా ఏదో ఒక రోజు మంచి పేరు వస్తుందనే ఉద్దేశ్యంతో దాన్ని ఇన్నాళ్లుగా కోమటిరెడ్డి బ్రదర్స్ నడిపించారు.
తాజాగా రాజకీయంగా వారు ఎదురు దెబ్బలు తింటున్నారు.కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో పాటు ఎంపీగా పోటీ చేసేందుకు భారీగా ఖర్చు చేయాల్సి వచ్చిందట.దాంతో ఛానెల్ను అమ్మేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.
మీడియాలో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న విజయసాయి రెడ్డి తాజాగా రాజ్ న్యూస్ను కొనుగోలు చేసి కొత్తగా ఏదైనా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఇప్పటికే రాజ్ న్యూస్ గురించి ఎవరికి తెలియదు.ఈయన తీసుకున్న తర్వాత ఏమైనా గుర్తింపు వస్తుందేమో చూడాలి.