ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాల పై తెగ ఆసక్తి చూపుతున్నారు.ఇప్పటికే పలువురు హీరోలు పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే మరో తమిళ హీరో కూడా పాన్ ఇండియా సినిమా పై ఆసక్తి చూపగా మొత్తానికి ఓ పాన్ ఇండియా లో అవకాశం వచ్చింది.ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు తమిళ స్టార్ హీరో విజయ్.
విజయ్ కు తమిళంలోనే కాకుండా తెలుగు సినీ పరిశ్రమలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.ఇక ఈయన సినిమాలకు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తారు.
మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ ప్రస్తుతం తన 65 సినిమా లో నటిస్తున్నాడు.ఇక ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఏ సినిమా అయినా మంచి విజయాన్ని సాధిస్తాయి.ఆయన ఎంచుకునే కథలు బాగా ఆకట్టుకుంటాయి.ఇక ఈయన విజయ్ తో పాన్ ఇండియా సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.సన్ పిక్చర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాకు అనిరుద్ తన సంగీతాన్ని వినిపిస్తున్నాడు.ఇదిలా ఉంటే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను జార్జియాలో ప్లాన్ చేశాడు డైరెక్టర్.
ప్రస్తుతం విజయ్ జార్జియా కు వెళ్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమా అత్యధిక భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమా కోసం గతంలో కన్నడ బ్యూటీ రష్మిక ను ఆఫర్ చేయగా తనకు డేట్స్ కుదరకపోవడంతో ఈ సినిమాను వదులుకుంది.ఇక మరో టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే ను సంప్రదించగా వెంటనే ఓకే చెప్పేసింది.
ఇక ఈ సినిమాకు పూజా హెగ్డే అత్యధిక పారితోషికం అందుకుంటుంది.