సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోల మధ్య పోటీ ఉండడం సర్వసాధారణం.ఇలా తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా కోలీ వుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారిలో అజిత్(Ajith) విజయ్(Vijay) ఒకరు.
ఇక వీరిద్దరూ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగడమే కాకుండా వీరి అభిమానుల మధ్య కూడా పెద్ద ఎత్తున పోటీ ఉంటుంది.ఇలా వీరి సినిమాల విడుదల సమయంలో అభిమానుల మధ్య పెద్ద ఎత్తున గొడవలు పడుతూ ఉంటారు.
ఇకపోతే వీరి మధ్య ఉన్న విబేధాలు ఉన్నప్పటికీ హీరో విజయ్ తాజాగా అజిత్ ఇంటికి వెళ్లిన ఘటన చోటు చేసుకుంది.తాజాగా అజిత్ తండ్రి మణి గారు( Mr.Mani ) మరణించిన విషయం మనకు తెలిసిందే.ఈ విషయం తెలిసి పలువురు సెలబ్రిటీలు ఆయన చివరి చూపుకు వెళ్లి నివాళులు అర్పించారు.
అయితే ఆ సమయంలో హీరో విజయ్ సినిమా షూటింగ్ పనుల నిమిత్తం ఈయన కాశ్మీర్లో ఉన్నారు.అయితే కాశ్మీర్ ( Kashmir )నుంచి తిరిగి చెన్నయ్ వచ్చిన విజయ్ అజిత్ ఇంటికి వెళ్లి తన తండ్రి చిత్ర పటానికి నివాళులు అర్పించారు.
అయితే ఈ విషయం తెలిసిన అభిమానులు మాత్రం సంతోషం వ్యక్తం చేశారు.
ఇలా ఈ హీరోలిద్దరు ఇలా కలవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇలా వీరు కలవడంతో ఇక పై వీరి అభిమానుల మధ్య గొడవలు తగ్గుతాయనీ అభిమానులు భావిస్తున్నారు.ఇక ఈ ఇద్దరు హీరోలు కూడా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
ఇక ఈ హీరోలకి తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇక విజయ్ ఇప్పటికే తెలుగు సినిమాలో నటించిన విషయం తెలిసిందే.
ఈయన తాజాగా వారసుడు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.