ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ మరో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాడు.ప్రెజెంట్ విజయ్ నటించిన సినిమా ‘వారిసు’.
ఈ సినిమా ముందు నుండి కోలీవుడ్ లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది.ఈ సినిమాను తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.మొదటిసారి విజయ్, రష్మిక జంటగా నటించడం వల్ల ఈ జోడి ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందా అని అంతా ఎదురు చూసారు.
ఇక ఈ క్రేజీ సినిమాను దిల్ రాజు భారీ స్థాయిలో శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నాడు.ఇదిలా ఉండగా ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
నిన్న పాన్ ఇండియా వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అయ్యింది.ఈ సినిమా తమిళ్ లో మాత్రం ఫ్యాన్స్ ను ఆకట్టు కునేలా ఉందని టాక్ వచ్చింది.ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమాలో కాస్త ఎమోషనల్ పాళ్ళు ఎక్కువే అని అంటున్నారు.అయితే ఇప్పటి వరకు ఇలాంటి సెంటిమెంట్ సినిమాలు అక్కడ తక్కువుగా వచ్చాయి కాబట్టి ఈ సినిమా అక్కడ బాగానే వర్కౌట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు.
కానీ తెలుగులో మాత్రం ఇలాంటి సినిమాలు కష్టమే.ఈ సినిమా తెలుగు వర్షన్ రిలీజ్ ఆగిపోయిన విషయం తెలిసిందే.ఈ సినిమా తెలుగు వర్షన్ ను జనవరి 14న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
అయితే తమిళ్ లో హిట్ టాక్ తెచ్చుకున్న వారసుడు తెలుగులో మాత్రం కష్టం.ఎందుకంటే ఇలాంటి ఎమోషనల్ ఎంటర్టైనర్స్ మన దగ్గర ఇప్పటికే చాలానే వచ్చాయి.
అందుకే తెలుగు ఆడియెన్స్ కు ఈ సినిమా రొటీన్ సినిమా లాగానే అనిపిస్తుంది.మరి తెలుగులో సరైన ప్రమోషన్స్ కూడా లేవు కాబట్టి ఈసారి దిల్ రాజుకు ఈ సినిమా మైనస్ అయ్యేలానే కనిపిస్తుంది.
మరి వారసుడుపై చాలా హోప్స్ పెట్టుకున్న దిల్ రాజు ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో అని ఎదురు చూస్తున్నాడు.