డిజిటల్ ఎంటర్టైన్మెంట్ హవా ప్రస్తుతం ఒక రేంజ్ లో ఉంది.థియేటర్ లు పూర్తి స్థాయిలో తెరుచుకోకపోవడంతో పాటు, పెద్ద సినిమాలు ఏవీ కూడా రిలీజ్ కాకపోవడం వలన ప్రేక్షకులు థియేటర్స్ వైపు చూడటం లేదు.
భవిష్యత్తులో కూడా ఒక మల్టిప్లెక్స్ లు తప్ప సింగిల్ థియేటర్స్ వైపు ప్రేక్షకులు మొగ్గు చూపించే అవకాశాలు ఉండకపోవచ్చు.దీనికి కారణం సినిమాలు అన్ని కూడా హ్యాపీగా ఇంట్లో ఫ్యామిలీతో కలిసి చూసుకునే అవకాశం రావడమే.
థియేటర్ సినిమా చూడటానికి వెళ్తే కనీసం రెండు వేలు ఖర్చు అవుతుంది.అయితే ఆ రెండు వేలు ఖర్చు పెడితే ఫ్యామిలీ మొత్తం ఇంట్లో కూర్చొని ఏడాది మొత్తం రిలీజ్ అయిన ప్రతి కొత్త సినిమా చూసుకోవచ్చు.
అలాగే కరోనా తర్వాత జనావాసం ఉండే ప్రాంతాలలో ఎక్కువగా తిరగడానికి ప్రజలు కూడా ఆసక్తి చూపించడం లేదు.కరోనా భయం ప్రతి ఒక్కరిలో ఉంది.
ఈ నేపధ్యంలో మళ్ళీ థియేటర్స్ కి పూర్వ వైభవం రావాలంటే చాలా కాలం పడుతుంది.ఈ లోపు డిజిటల్ ఎంటర్టైన్మెంట్ మొత్తం మార్కెట్ ని ఆక్యుపై చేసేస్తుంది.
దీనిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే హీరోయిన్లు లాంగ్ టర్మ్ కెరియర్ కోసం వెబ్ సిరీస్ లవైపు శ్రద్ధ చూపిస్తున్నారు.
వెబ్ సిరీస్ లు అయితే కొత్త కొత్త పాత్రలు చేసే స్కోప్ దొరుకుతుందనే అభిప్రాయంతో స్టార్ హీరోయిన్లు సైతం అదే బాట పట్టారు.
మరో వైపు హీరోలు కూడా వెబ్ సిరీస్ ల వైపు చూస్తున్నారు.ఇప్పుడు బాలీవుడ్ హీరో షాహిద్కపూర్ అమెజాన్ ప్రైమ్ కోసం ఓ వెబ్సిరీస్లో నటిస్తున్నాడు.ఈ వెబ్సిరీస్లో తమిళ స్టార్ హీరో విజయ్సేతుపతి కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారని తెలుస్తుంది.దర్శకులు రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ కోసం విజయ్ సేతుపతిని ఎంపిక చేశారని తెలుస్తుంది.
జనవరిలో ముంబై, గోవాలో ఈ వెబ్సిరీస్ షూటింగ్ ప్రారంభమవుతుంది.షాహిద్కపూర్, సేతుపతి ఇద్దరికీ ఇదే తొలి వెబ్సిరీస్.
ఓ విధంగా చెప్పాలంటే మల్టీ స్టారర్ వెబ్ సిరీస్ గా దీనిని చెప్పొచ్చు.మరి వీరి బాటలో ఇంకెంత మంది హీరోలు వెబ్ సిరీస్ ల వైపు వస్తారనేది చూడాలి.