వైసీపీ ప్రభుత్వం పైన, సీఎం జగన్ పైన ఘాటు పదజాలంతో సందర్భం వచ్చినప్పుడు విమర్శలు చేస్తూ సెటైర్లు వేస్తున్న టిడిపి సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు, అలాగే టిడిపి సీనియర్ నేత సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి వారి వ్యవహారంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తనదైన శైలిలో వ్యంగ్యంగా విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో యాక్తీవ్ గా ఉంటున్నారు విజయ సాయి రెడ్డి.టిడిపి నుంచి ఏ సీనియర్ నాయకుడు స్పందించి విమర్శలు చేసినా వారికి తగిన విధంగా కౌంటర్ ఇస్తూ విజయ్ సాయి రెడ్డి ట్రెండింగ్ లో ఉంటున్నారు.నిన్న మొన్నటి వరకు విశాఖ టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు పై తీవ్ర పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టిన విజయసాయిరెడ్డి, తాజాగా టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తున్నారు. ” ఒరేయ్ బుచ్చిగా ! మహిళని చూడకుండా అభాగ్యురాలిని ఈడ్చి కొట్టావు.వయసుకు తగ్గ హుందాతనం నీ పత్తి గింజ బతుకులో ఏనాడైనా చూపించవా ? ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అడ్డుపడితే పేదలు తరిమికొట్టింది నువ్వు మరిచినట్టు నటించినా అందరికీ గుర్తుంది ? ” అంటూ ఓ పోస్టింగ్ పెట్టారు. ఇక మద్యం బ్రాండ్ల విషయంలో టిడిపి నాయకులు, ఆ పార్టీ అనుకూల మీడియా చేస్తున్న విమర్శలకు విజయసాయిరెడ్డి ఘాటుగా సమాధానం ఇచ్చారు.” మద్యం బ్రాండ్లలో విషం ఉందని దొంగ రిపోర్టు సృష్టించాడు నారా నీచుడు.తాము టెస్టులే చేయలేదని SGS ల్యాబ్ చెప్పుతో కొట్టింది.
పాయిజన్ అయింది.తెలుగు దొంగల పార్టీ బుర్రలు ఈర్ష ఆలోచనలు.బెల్టుషాపులు నడిపించిన రోజుల్లో కల్తీ సరుకు అమ్మించాడు ఆల్జీమర్స్.ఇప్పుడా స్కోపే లేదు మెంటల్.” అంటూ మరో పోస్ట్ పెట్టారు. ” బ్రోతల్ హౌస్ వగలాడి ఓనర్ మాటలు నిజమని నమ్మేలా ఉంటాయి.అందుకే చీటర్ చంద్రం మద్యం బ్రాండ్ల గురించి వేశ్యల చేత చిలక పలుకులు పలికిస్తున్నాడు.వెన్నుపోటు వీరుడు ఎవరికి ఎంత ఇచ్చింది తనను ఎలా బ్లాక్ మెయిల్ చేశాడో విజయ్ మాల్యా దేశం వదిలి పారిపోయే ముందు చెప్పాడు.” అంటూ వరుసగా సోషల్ మీడియా పోస్టింగ్స్ ద్వారా విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు
.