వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆ పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి మరోసారి తనదైన శైలిలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పాటు ఆ పార్టీ ముఖ్య నాయకులపై తీవ్ర పద జాలాన్ని ఉపయోగిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.గతంతో పోలిస్తే తన విమర్శలు మరింత ఘాటు ఉండేలా విజయ్ సాయి రెడ్డి విమర్శలు చేస్తున్నారు.
గత కొద్ది రోజులుగా విజయసాయిరెడ్డి పెడుతున్న సోషల్ మీడియా పోస్టులకు టిడిపి నాయకులు అంతే స్థాయిలో ప్రతి విమర్శలు చేస్తూ ఉండడంతో రోజురోజుకు ఈ వ్యవహారం మరింత ముదురుతోంది.తాజాగా పెట్టిన పోస్ట్ లో నారా లోకేష్ పై విమర్శలు చేశారు. ” ఒరేయ్ బొకేషూ… ప్రజల గుండెల్లో స్థానం పొందాలంటే ‘ బూతులు బురద ‘పారించడం కాదురా , ఉస్కో అంటూ టిడిపి బోకు – పోరంబోకు కుక్కలు అన్నిటిని ఉసిగొల్పావు.అవి మొరుగుతుంటే సున్తానందం పొందుతున్నావు.బంధం తెంచుకున్న బర్రెలా ఊరు మీద పడితే చివరకు నువ్వు చేరేది బందెల దొడ్లోకేరా.“ అంటూ విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు ఇక జగన్ ఉద్దేశించి లోకేష్ సోషల్ మీడియాలో విమర్శలు చేశారు.” మీడియాను చూస్తే భయం.మీడియా అంటే వణుకు.చివరికి యూట్యూబ్ ఛానల్ తమ్ముని చూసి జడుసుకునే జగన్ రెడ్డి సింగిల్ గా వచ్చే సింహమా ! వీధి కుక్క కూడా కాదు.ఈ మాదిరి పిరుకోడికి నా వెంట్రుక పీకలేరు అంటూ పిల్లల ముందు బిల్డప్ ఎందుకు ? ” అంటూ జగన్ ఉద్దేశించి లోకేష్ చేసిన విమర్శలకు విజయసాయిరెడ్డి తనదైన సేవలు కౌంటర్ ఇచ్చారు.
” ఒరేయ్ పిల్ల కాకి.నీ బాబును అడుగు ఎవరు కలలో కనిపిస్తే భయంతో పక్క తడిసిపోతుందో.ఆరోజు జూన్ మీటింగ్ నుంచి మధ్యలోనే పారిపోయావు.జడుపుకి వారం రోజులు చలి జ్వరం పట్టింది.బిచ్చగాడివి నీకెందుకురా .జగన్ గారి గురించి మాట్లాడితే మెదడు ఏమీ పెరగదు. 7th,8th క్లాస్ IQ లెవల్ గాదివి.” అంటూ విజయ సాయి విరుచుకుపడ్డారు.