టాలీవుడ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ సినిమా చేస్తున్నాడు.డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన పూరీ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.అదే హుషారుతో లైగర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
విజయ్ దేవరకొండ కు ఇప్పటికే యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.
ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకోవాలని విజయ్ చాలా శ్రమిస్తున్నాడు.
బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమా కోసం విజయ్ స్పెయిల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు.
ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.ఇప్పటికే ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ విడుదల అయ్యి విశేష ఆదరణ పొందింది.
ఈ కాంబినేషన్ పై మరిన్ని అంచనాలను పెంచింది.
అయితే ఇప్పుడు ఈ సినిమా స్టోరీ లైన్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతుంది.ఈ సినిమాలో విజయ్ జాతీయ స్థాయి బాక్సర్ గా కనిపించబోతున్నాడని సమాచారం.ఫస్ట్ హాఫ్ లో నేషనల్ లెవల్ కు చేరుకుంటాడని.
ఇక సెకండ్ హాఫ్ లో ఇంటర్నేషనల్ స్థాయికి చేరుకునే బాక్సర్ గా విజయ్ కనిపిస్తాడట.ఈ మధ్యలో ఆయనకు ఎటువంటి సంఘటనలు ఎదురవుతాయన్నదే ఈ సినిమా కథ.
ఇది ఇలా ఉండగా ఈ సినిమాను పూరీ జగన్నాథ్ తో పాటు బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సంయుక్తం గా తెరకెక్కిస్తున్నారు.బడ్జెట్ విషయం లో ఏ మాత్రం తగ్గకుండా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.