స్టార్ సెలబ్రెటీలు అందరూ వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా అప్పుడప్పుడు సందడి చేస్తూ ఉంటారు.రియాలిటీ షోల ద్వారా వాళ్ళలో ఉన్న యాంకరింగ్ టాలెంట్ ని బయట పెడతారు.
ఇప్పటికే సౌత్ లో నాగార్జున, చిరంజీవి, రానా, ఎన్ఠీఆర్, నాని లాంటి స్టార్ హీరోలు వారిలో యాంకరింగ్ టాలెంట్ ని బయట పెట్టారు.అలాగే సక్సెస్ కూడా అయ్యారు.
ఇప్పుడు బుల్లితెరతో పాటు డిజిటల్ మీడియా కూడా ఎంటర్టైన్మెంట్ రంగంలోకి వచ్చింది.ఓటీటీ చానల్స్ అందుబాటులోకి రావడంతో పాటు సదరు ఛానల్స్ కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ని డిజైన్స్ చేస్తూ ప్రేక్షకులని ఆకర్షిస్తున్నాయి.
ఇప్పటికే కొత్త సినిమాలు రిలీజ్ చేస్తూ తమ మార్కెట్ ని పెంచుకుంటున్నాయి.ఇప్పుడు రియాలిటీ షోలకి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాయి.
ఓ వైపు వెబ్ సిరీస్ లు చేస్తూ, మరో వైపు రియాలిటీ షోల కోసం ఫేమ్ ఉన్న సెలబ్రెటీలని రంగంలోకి దించుతున్నారు.
విజయ్ దేవరకొండ ఇప్పుడు ఓ షోకి హోస్ట్ గా చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.
ఇండియాలో పాపులర్ హిప్ హాప్ డాన్స్ షో షఫుల్ నాల్గో సీజన్ వచ్చే ఏడాది నుండి ప్రారంభం కానుంది.దేశంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న టాలెంట్ ను వెలికితీయడమే ఈ షో ప్రధాన ఉద్దేశం.
ఈ షోకి విజయ్ దేవరకొండ వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారు.ఇప్పటివరకు డాన్స్ ప్రధానంగా నడిచిన ఈ షోలో ఈసారి డాన్స్ తో పాటు ఆర్ట్, మ్యూజిక్ వంటి కళారూపాల్లో కూడా పోటీలుంటాయని తెలుస్తోంది.
ఈ షోకి విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్ 1 నేనొక్కడినే ఫేమ్ కృతిసనన్ కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించనుంది.ఈ షో కలర్స్ ఛానల్ లో ప్రసారం కానుంది.
మరి హిందీ రియాలిటీ షో ద్వారా వ్యాఖ్యాతగా ఎంట్రీ ఇస్తున్న విజయ్ దేవరకొండ అక్కడ ఎంత వరకు సక్సెస్ అవుతాడు అనేది చూడాలి.
.