అర్జున్రెడ్డి సినిమాతో ఒక్కసారిగా క్రేజీ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ.అతనిని అభిమానులు అందరూ రౌడీ స్టార్ అని పిలుచుకుంటారు.
గీతాగోవిందం సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా ఏకంగా వందకోట్ల కలెక్షన్ హీరోగా అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు.అర్జున్ రెడ్డిలో విజయ్ బోల్డ్ పెర్ఫార్మెన్స్, గీతాగోవిదం సినిమాలో క్లాసిక్ పెర్ఫార్మెన్స్ తో అతనిలో విభిన్నమైన నటుడు అందరికి కనిపించాడు.
పాత్ర ఎలాంటిదిఅయినా తనకి సరిపోయే విధంగా మార్చుకొని పెర్ఫార్మ్ చేసే విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుంది.
ప్రెజెంట్ యూత్ ఐకాన్ గా ఉన్న విజయ్ ని బాలీవుడ్ కి పరిచయం చేయాలని కరణ్ జోహార్ లాంటి బడా నిర్మాత ప్లాన్ చేస్తున్నాడంటే రౌడీ స్టార్ స్టామినా ఏంటో అర్ధం చేసుకోవచ్చు.
ఇదిలా ఉంటే ఇప్పుడు విజయ్ బాలీవుడ్ ఎంట్రీ గురించి ఆసక్తికరమైన వార్త బయటకి వచ్చింది.
బాలీవుడ్ ఎంట్రీ ఖరారయిందని టాక్ నడుస్తుంది.హిందీలో కాయ్ పో చే, కేదార్నాథ్ తదితర చిత్రాలను అందించిన దర్శకుడు అభిషేక్ కపూర్ దర్శకత్వంలో విజయ్ ఎంట్రీ ఖరారైందని తెలుస్తుంది.
ఈ సినిమాకు బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్లీలా భన్సాలీ, భూషణ్కుమార్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారని సమాచారం.భారత్–పాకిస్తాన్ సైనికుల మధ్య జరిగిన దాడిలో వింగ్కమాండర్ అభినందన్ వర్థమాన్ పాకిస్తాన్ సైనికుల చేతికి చిక్కిన విషయం తెలిసిందే.
మూడు రోజులు అతనిని బందీగా ఉంచి పాక్ ప్రభుత్వం తిరిగి అభినందన్ని భారత ప్రభుత్వానికి అప్పగించింది.ఈ నేపధ్యంలో అభినందన్ జీవితం ఆధారంగా అభిషేక్ కపూర్ ఈ సినిమా రూపొందించనున్నారని తెలుస్తుంది.
ఇప్పటికే దర్శకుడు అభిషేక్ విజయ్ దేవరకొండ కథ చెప్పడం జరిగిందని, అది విని రౌడీ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది.అభినందన్ పాత్రలో విజయ్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇక అభినందన్ వర్ధమాన్ తమిళనాడుకి చెందిన వ్యక్తి కావడం వలన ఈ సినిమాకి సౌత్ లో కూడా క్రేజ్ ఉంటుందని భావించి వీలైతే పాన్ ఇండియా మూవీగానే ఆవిష్కరించాలని చూస్తున్నట్లు తెలుస్తుంది.