టాలీవుడ్ లో క్రేజీ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకొని దూసుకుపోతున్న యువ హీరో విజయ్ దేవరకొండ.ఈ యంగ్ హీరో ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.
లైగర్ టైటిల్ తో బాక్సింగ్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా బాలీవుడ్ మార్కెట్ ని కూడా సొంతం చేసుకోవాలనే ప్రయత్నం ఈ రౌడీ స్టార్ ఉన్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది.
రౌడీ స్టార్ కెరియర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ ముంబైలో ఉండటం వలన అక్కడ సెలబ్రిటీ పార్టీలతో సందడి చేయడంతో పాటు బాలీవుడ్ మీడియా దృష్టిలో పడేందుకు తనకున్న అన్ని అవకాశాలని వినియోగించుకుంటున్నాడు.
అలాగే తనకి సంబందించిన ప్రతి మూమెంట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నాడు.
ఈ నేపధ్యంలో రౌడీ స్టార్ ఫేమస్ సెలబ్రిటీ ఫాషన్ ఫోటోగ్రాఫర్ డాబూ రాతానీ క్యాలెండర్ కి ఫోజులు ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.
డాబూ రాతానీ క్యాలెండర్ అంటూ బాలీవుడ్ బ్యూటీస్ అందరూ పోటీ పడుతూ ఉంటారు.అతని ఫోటో షూట్ కి అంత పాపులారిటీ ఉంది.
ఇండియాలోనే డాబూ మోడల్ క్యాలెండర్ కి మంచి బ్రాండ్ ఉంది.ప్రతీ ఏడాది ప్రముఖ స్టార్ హీరో, హీరోయిన్లతో డబూ రత్నాని కాలెండర్ షూట్ నిర్వహిస్తారు.
ఇప్పటికే ఐశ్వర్యరాయ్, కియారా అద్వానీ, షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, వరుణ్ ధావన్ , అభిషేక్ బచ్చన్ వంటి పాపులర్ స్టార్స్ డబూ రత్నాని ఫోటోలకు ఫోజులిచ్చారు.ఈ ఏడాది 2021 కాలెండర్ షూట్లో విజయ్ హ్యాండ్సమ్గా కనిపించనున్నారు.
ఇప్పటికే దీనికి సంబందించిన ఫోటో షూట్ పూర్తయినట్లు తెలుస్తుంది.ఈ క్యాలెండర్ ఫోటోషూట్ ద్వారా బాలీవుడ్ మీడియాని ఆకర్షించే పనిలో విజయ్ ఉన్నాడు.
మరో వైపు బాలీవుడ్ బ్యూటీస్ కూడా విజయ్ దేవరకొండతో ఎక్కువగా పార్టీలలో సందడి చేస్తూ స్పెషల్ ఎట్రాక్షన్ గా బిటౌన్ లో నిలుస్తున్నారు.